PM Modi: ఎన్నికల వేళ విదేశీ పర్యటనకు మోడీ.. ఏ దేశమంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజుల టూర్ ఖరారైంది. మార్చి 21, 22 తేదీల్లో ప్రధాని మోడీ భూటాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
మోడీ మార్చి 21, 22న రెండ్రోజుల పాటు భూటాన్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలం నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ను కలవనున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అలాగే భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గేతో కూడా భేటీ అయి మోడీ చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ముందుకు సాగనున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్లో కుప్పకూలిన బొగ్గు గని.. 12 మంది దుర్మరణం..
ఇదిలా ఉంటే భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే జనవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా గత వారం ఐదు రోజుల పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. టోబ్గే మార్చి 14న ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు, ఈ సమయంలో భూటాన్ను సందర్శించాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. ఈ ఏడాది జనవరిలో రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత టోబ్గే విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. భారతదేశం-భూటాన్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ ప్రధాని మోడీతో చర్చలు జరిపారు.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మోడీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలి విడతలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుంది. దీంతో ఆయన సౌతిండియాపై దృష్టి పెట్టారు.

తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!