భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18(రేపు) రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
Read Also: Conference: ఈనెల 21న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్..
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉందంటే..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఈనెల 23 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు.
డిసెంబర్ 18 (రేపు) సికింద్రాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు.
డిసెంబర్ 19న హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
డిసెంబర్ 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ను రాష్ట్రపతి సందర్శిస్తారు.
ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో కూడా సంభాషించనున్నారు.
అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్ను ఏర్పాటు చేస్తారు.
డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.