Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News President Droupadi Murmu Speech In Budget Session 2024

Budget Sessions 2024: పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది: ద్రౌపది ముర్ము

Published Date :January 31, 2024 , 11:49 am
By Sampath Kumar
Budget Sessions 2024: పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది: ద్రౌపది ముర్ము
  • Follow Us :
  • google news
  • dailyhunt

President Droupadi Murmu Speech in Budget Session 2024: కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇదే తన తొలి ప్రసంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని కొనియాడారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలిదేశంగా భారత్‌ రికార్డు సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2024 పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. కొత్త పార్లమెంట్‌లో తొలిసారిగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ 2024 సమావేశాల సందర్భంగా నూతన భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ‘కొత్త పార్లమెంట్‌లో ఇదే నా తొలి ప్రసంగం. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది. జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది’ అని రాష్ట్రపతి అన్నారు.

Also Read

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

‘శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. భగవాన్‌ బిర్సా ముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా నిర్వహించుకుంటున్నాం. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం. ఆ సియా క్రీడల్లో భారత్‌ తొలిసారి 107 పతకాలు, పారా క్రీడల్లో 111 పతకాలు సాధించింది. తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీశక్తి వందన్ అధినియమ్‌ బిల్లును ఆమోదించుకున్నాం. శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం అయోధ్యలో సాకారమైంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి రాముడి ఆలయాన్ని ప్రారంభించాం’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.

Also Read: Mayank Agarwal: విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్!

‘దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. రీఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ నినాదంతో ముందుకెళ్తున్నాం. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. చిన్నతనం నుంచి మనం ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించుకున్నాం. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ఎత్తివేయడం చారిత్రక నిర్ణయం. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మన నినాదం’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget Session 2024
  • Droupadi Murmu
  • Droupadi Murmu Speech
  • india president
  • Sammakka Sarakka Tribal University

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions