Mayank Agarwal: విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cricketer Mayank Agarwal files police complaint: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విమానంలో సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్లో మంచినీళ్లుగా భావించి హానికర ద్రవం తాగడంతో తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని ఆపి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఈ ఘటనపై మయాంక్ తన మేనేజర్ సహాయంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.
మయాంక్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్. అతడి ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. అయితే మయాంక్ మేనేజర్ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఎన్సీసీపీఎస్ (న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్)కి ఫిర్యాదు చేసారు’ అని ఎస్పీ వెస్ట్ త్రిపుర కిరణ్ కుమార్ తెలిపారు. ‘మయాంక్ విమానంలో కూర్చున్నప్పుడు అతని ముందున్న ద్రవాన్ని కొద్దిగా తాగాడు. అకస్మాత్తుగా అతని నోటిలో ఇబ్బంది మొదలైంది. ఒక్కసారిగా అతను మాట్లాడలేకపోయాడు. మయాంక్ నోటిలో వాపు మరియు బొబ్బలు వచ్చాయి. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని మయాంక్ మేనేజర్ పోలీసులకు తెలిపాడు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
Also Read: IND vs ENG: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. విరాట్ కోహ్లీ దూరం!
రంజీట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడటకం కోసం కర్ణాటక టీమ్ అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ అయిన మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి ఇండిగో ఎయిర్లైన్స్లో బయలుదేరాడు. సీటు ముందున్న కవర్ (పౌచ్)లోని బాటిల్లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే మయాంక్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. వైద్యుల సూచనల మేరకు మయాంక్ను బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!