Delhi: ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఏప్రిల్ 10న మంత్రి పదవికి ఆనంద్ రాజీనామా
- అనంతరం మే 5న బీఎస్పీలో చేరిక
- న్యూఢిల్లీ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. అనంతరం న్యూఢిల్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏప్రిల్ 10న మంత్రి పదవికి రాజీనామా చేయగా.. మే 5న బీఎస్పీలో చేరారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
రాజీనామా తర్వాత ఆనంద్.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం కేటాయించిన నిధులను ఇతర పనులు, పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆనంద్ సాంఘిక సంక్షేమం, SC/ST సంక్షేమం మరియు సహకార శాఖలతో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్.. షూటింగ్ ఆపేసి నిర్మాతతో మీటింగ్.. నటుడి షాకింగ్ కామెంట్స్
జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిఫారసు మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా… రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కేజ్రీవాల్ అధికారిక లేఖలో ఆనంద్ రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేశారు. మొత్తానికి జూన్ 11న రాష్ట్రపతి ఆమోదించారు. తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఆనంద్ న్యూఢిల్లీ స్థానం నుంచి BSP అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆయనకు కేవలం 5629 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆనంద్.. ఆప్ అభ్యర్థి తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన భారత కూటమి అభ్యర్థి, ఆప్ నేత సోమనాథ్ భారతికి మొత్తం 3,74,815 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన బాన్సూరి స్వరాజ్ 4,53,185 ఓట్లు సాధించారు.

తాజావార్తలు
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!