Delhi: ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఏప్రిల్ 10న మంత్రి పదవికి ఆనంద్ రాజీనామా
- అనంతరం మే 5న బీఎస్పీలో చేరిక
- న్యూఢిల్లీ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. అనంతరం న్యూఢిల్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏప్రిల్ 10న మంత్రి పదవికి రాజీనామా చేయగా.. మే 5న బీఎస్పీలో చేరారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
Also Read
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
రాజీనామా తర్వాత ఆనంద్.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం కేటాయించిన నిధులను ఇతర పనులు, పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆనంద్ సాంఘిక సంక్షేమం, SC/ST సంక్షేమం మరియు సహకార శాఖలతో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్.. షూటింగ్ ఆపేసి నిర్మాతతో మీటింగ్.. నటుడి షాకింగ్ కామెంట్స్
జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిఫారసు మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా… రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కేజ్రీవాల్ అధికారిక లేఖలో ఆనంద్ రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేశారు. మొత్తానికి జూన్ 11న రాష్ట్రపతి ఆమోదించారు. తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఆనంద్ న్యూఢిల్లీ స్థానం నుంచి BSP అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆయనకు కేవలం 5629 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆనంద్.. ఆప్ అభ్యర్థి తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన భారత కూటమి అభ్యర్థి, ఆప్ నేత సోమనాథ్ భారతికి మొత్తం 3,74,815 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన బాన్సూరి స్వరాజ్ 4,53,185 ఓట్లు సాధించారు.

తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!