Delhi: ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఏప్రిల్ 10న మంత్రి పదవికి ఆనంద్ రాజీనామా
- అనంతరం మే 5న బీఎస్పీలో చేరిక
- న్యూఢిల్లీ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. అనంతరం న్యూఢిల్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏప్రిల్ 10న మంత్రి పదవికి రాజీనామా చేయగా.. మే 5న బీఎస్పీలో చేరారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రాజీనామా తర్వాత ఆనంద్.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం కేటాయించిన నిధులను ఇతర పనులు, పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆనంద్ సాంఘిక సంక్షేమం, SC/ST సంక్షేమం మరియు సహకార శాఖలతో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్.. షూటింగ్ ఆపేసి నిర్మాతతో మీటింగ్.. నటుడి షాకింగ్ కామెంట్స్
జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిఫారసు మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా… రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కేజ్రీవాల్ అధికారిక లేఖలో ఆనంద్ రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేశారు. మొత్తానికి జూన్ 11న రాష్ట్రపతి ఆమోదించారు. తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఆనంద్ న్యూఢిల్లీ స్థానం నుంచి BSP అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆయనకు కేవలం 5629 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆనంద్.. ఆప్ అభ్యర్థి తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన భారత కూటమి అభ్యర్థి, ఆప్ నేత సోమనాథ్ భారతికి మొత్తం 3,74,815 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన బాన్సూరి స్వరాజ్ 4,53,185 ఓట్లు సాధించారు.

తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!