Delhi: ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఏప్రిల్ 10న మంత్రి పదవికి ఆనంద్ రాజీనామా
- అనంతరం మే 5న బీఎస్పీలో చేరిక
- న్యూఢిల్లీ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. అనంతరం న్యూఢిల్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏప్రిల్ 10న మంత్రి పదవికి రాజీనామా చేయగా.. మే 5న బీఎస్పీలో చేరారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
రాజీనామా తర్వాత ఆనంద్.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం కేటాయించిన నిధులను ఇతర పనులు, పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆనంద్ సాంఘిక సంక్షేమం, SC/ST సంక్షేమం మరియు సహకార శాఖలతో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్.. షూటింగ్ ఆపేసి నిర్మాతతో మీటింగ్.. నటుడి షాకింగ్ కామెంట్స్
జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిఫారసు మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా… రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కేజ్రీవాల్ అధికారిక లేఖలో ఆనంద్ రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేశారు. మొత్తానికి జూన్ 11న రాష్ట్రపతి ఆమోదించారు. తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఆనంద్ న్యూఢిల్లీ స్థానం నుంచి BSP అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆయనకు కేవలం 5629 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆనంద్.. ఆప్ అభ్యర్థి తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన భారత కూటమి అభ్యర్థి, ఆప్ నేత సోమనాథ్ భారతికి మొత్తం 3,74,815 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన బాన్సూరి స్వరాజ్ 4,53,185 ఓట్లు సాధించారు.

తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!