Delhi: ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఆప్ మంత్రి ఆనంద్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
- ఏప్రిల్ 10న మంత్రి పదవికి ఆనంద్ రాజీనామా
- అనంతరం మే 5న బీఎస్పీలో చేరిక
- న్యూఢిల్లీ లోక్సభ నుంచి పోటీ చేసి ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీఎస్పీలో చేరారు. అనంతరం న్యూఢిల్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏప్రిల్ 10న మంత్రి పదవికి రాజీనామా చేయగా.. మే 5న బీఎస్పీలో చేరారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
Also Read
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
రాజీనామా తర్వాత ఆనంద్.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం కేటాయించిన నిధులను ఇతర పనులు, పథకాలకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆనంద్ సాంఘిక సంక్షేమం, SC/ST సంక్షేమం మరియు సహకార శాఖలతో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ప్రొడక్షన్ వర్కర్లకి నాసిరకం ఫుడ్.. షూటింగ్ ఆపేసి నిర్మాతతో మీటింగ్.. నటుడి షాకింగ్ కామెంట్స్
జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిఫారసు మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా… రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో కేజ్రీవాల్ అధికారిక లేఖలో ఆనంద్ రాజీనామాను ఆమోదించాలని సిఫారసు చేశారు. మొత్తానికి జూన్ 11న రాష్ట్రపతి ఆమోదించారు. తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఆనంద్ న్యూఢిల్లీ స్థానం నుంచి BSP అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఆయనకు కేవలం 5629 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆనంద్.. ఆప్ అభ్యర్థి తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన భారత కూటమి అభ్యర్థి, ఆప్ నేత సోమనాథ్ భారతికి మొత్తం 3,74,815 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన బాన్సూరి స్వరాజ్ 4,53,185 ఓట్లు సాధించారు.

తాజావార్తలు
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!