Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక “బొద్దింక”గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ ఐస్క్రీమ్లో మామిడి పండు గుజ్జును కలుపుకుని తింటూ కనిపించారు. దానికి ఆయన పెట్టిన క్యాప్షన్, చేసిన కామెంట్లు ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమానికి మరింత హైప్ను తీసుకొచ్చాయి. “బొద్దింకలు మామిడి పండ్లను ఎలా తింటాయో చూడండి” అంటూ ప్రధానమంత్రికి ఇష్టమైన పండుగా చెప్పుకునే మామిడి పండును తింటూ ప్రకాశ్రాజ్ ఈ సెటైరికల్ జిల్లేడును విసిరారు. “కాక్రోచ్ ఈటింగ్ మ్యాంగోస్.. యమ్మీ” అంటూ #CockroachJantaParty, తన మార్క్ హ్యాష్ట్యాగ్ #justasking జత చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. 61 ఏళ్ల ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ ఈ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వడమే కాకుండా.. వాటి పోస్టులను షేర్ చేస్తూ యువత గొంతుకను మరింత మందికి చేరువ చేస్తున్నారు.
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ఈ సరికొత్త ఆన్లైన్ ట్రెండ్ కేవలం ప్రకాష్ రాజ్తోనే ఆగిపోలేదు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మీర్జా, ఈషా గుప్తా, ఫాతిమా సనా షేక్, దర్శకుడు కునాల్ కోహ్లీ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ అకౌంట్లను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే అనే 30 ఏళ్ల బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ప్రారంభించిన ఈ వ్యంగ్య ప్రచారం.. ఇంటర్నెట్లో ఒక చిన్న జోక్లా మొదలై ఇప్పుడు పెను తుఫాన్లా మారింది. మే 16న లాంచ్ అయిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజీ.. కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా 19 మిలియన్ల (1.9 కోట్లు) ఫాలోవర్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Cockroach eating mangoes.. yummy 😜😜😜#CockroachJantaParty #justasking pic.twitter.com/8oEseWgqtF
— Prakash Raj (@prakashraaj) May 22, 2026
తాజావార్తలు
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?