Prakash Javadekar : కేసీఆర్ కుటుంబపాలనకు స్వస్తి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు
బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదో అవగాహన ఉందనే కుట్రపూరిత ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ ప్రకాశ్ జావదేకర్. ఇవాళ ఆయన ఢిల్లీలో ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వాస్తవానికి, బిజేపి పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగేలా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లే లోపాయుకారిగా కలిసి పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని అరెస్ట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతకు ముందు బండి సంజయ్ ను కూడా నిర్బందించింది. కేసులు పెడుతోందన్నారు. ఇది నాటకం ఎలా అవుతుంది….అలా అనడం పూర్తిగా అబద్ధమన్నారు. అంతేకాకుండా.. ‘కేసీఆర్ కుటుంబపాలనకు స్వస్తి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మా వైపే ఉన్నారు. మీరే చూస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపుకు వెళ్ళిందనేది నిజం కాదు. క్షేత్రస్థాయిలో బిజేపి బలంగా ఉంది.
Also Read : BRS Leaders : బీఆర్ఎస్ అసమ్మతి నేతలు.. కోదాడలో మరోసారి ఆత్మీయ సమావేశం
Also Read
- Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
- West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
- Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఎన్నికలకు బీజేపీ శ్రేణులన్నీ సమాయత్తం అవుతున్నాయు. ఓ వారంలో మొదటి విడత అభ్యర్ధుల జాబితాను ప్రకటించబోతున్నాం. అక్టోబర్ 1 నుంచి తెలంగాణ లో బిజేపి వరుసగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ప్రధాని మోడి తో సహా, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి సీనియర్ నేతలంతా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. పేదరికం నుంచి వచ్చిన ప్రధాని మోడి పేదప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. పేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ప్రధాని మోడీని తమవాడిగా భావిస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి లభించే ఉచిత బియ్యం మోడి ప్రభుత్వం ఇచ్చినవే. రానున్న 60 రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతోందో మీరే చూస్తారు. రాజకీయాలలో 60 రోజులంటే చాలా ఎక్కువ. మాదగ్గర అనేక అస్త్రాలున్నాయు…. వ్యూహాలు ఉన్నాయి. మీరే చూస్తారు. వచ్చే రెండునెలలు హైదరాబాద్ లోనే ఉంటాను. 26 వేల పోలింగ్ కేంద్రాల్లో (బూత్ లు) బీజేపీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నారు. ‘ అని ప్రకాశ్ జావదేకర్ అన్నారు.
Also Read : Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి
తాజావార్తలు
-
Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
-
MS Dhoni: దు:ఖంలో సీఎస్కే ఫ్యాన్స్.. ఐపీఎల్ 2026 నుంచి ధోనీ అవుట్!
-
Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
-
White House: లాక్డౌన్లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!