Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ గెలిచిన వెంటనే సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్లను జట్టు నుంచి తొలగించడంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో కూడా ‘తర్వాతి వంతు నాదేనేమో’ అనే భయం పట్టుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ ఖేల్ జర్నలిస్ట్ విమల్ కుమార్తో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్, టీమ్ మేనేజ్మెంట్ వైఖరిని తప్పుపట్టారు.
ఆటగాళ్లలో పెరుగుతున్న అభద్రతాభావం..
సంగీతాత్మక కుర్చీల ఆటలా ఆటగాళ్లను మార్చడం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని అశ్విన్ అన్నారు. వరల్డ్ కప్ గెలిపించిన సంజూ, సూర్యలను హఠాత్తుగా పక్కనబెడితే, వారు నెట్స్లో ఎలా ప్రాక్టీస్ చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారని, దీనివల్ల సంజూకు 3వ నంబర్ స్థానం కూడా దక్కకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితి సంజూకే కాకుండా, టీమిండియా భవిష్యత్తుకు కూడా మంచిది కాదన్నారు.
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
సరైన కమ్యూనికేషన్ అవసరం
ఒకవేళ కొత్త ఆటగాడు (వైభవ్ సూర్యవంశీ) జట్టులోకి వస్తున్నప్పుడు, సీనియర్లకు స్పష్టమైన భరోసా ఇవ్వాలని అశ్విన్ సూచించారు. “నేనే గనుక ఆ స్థానంలో ఉంటే, సంజూ లేదా అభిషేక్ వద్దకు వెళ్లి… ‘కొత్త కుర్రాడు బెంచ్పై ఒత్తిడి పెంచుతున్నాడు. కానీ, మీరు మాకు వరల్డ్ కప్ గెలిపించారు కాబట్టి మీకు కనీసం 2-3 సిరీస్ల వరకు పూర్తి అవకాశం ఇస్తాం. ఆ తర్వాతే ప్రదర్శన ఆధారంగా నిర్ణయం ఉంటుంది’ అని చెప్పేవాడిని” అని అశ్విన్ పేర్కొన్నారు.
ధోనీ ఉదాహరణను గుర్తుచేసిన అశ్విన్..
భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే చరిత్రను ఒకసారి తిరగేయాలని అశ్విన్ హితవు పలికారు. గతంలో రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయాలని చాలా మంది అన్నప్పటికీ, ఎంఎస్ ధోనీ అతనికి అండగా నిలబడి సుదీర్ఘ అవకాశం ఇచ్చాడని, అందుకే ఈరోజు జడేజా ఒక లెజెండ్ అయ్యాడని గుర్తుచేశారు.
కుటుంబంలో ఇద్దరు పిల్లల లాంటివారే
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువగా చూడలేమని, జట్టులో అందరికీ ఒకేలా న్యాయం చేయడం కష్టమే అయినా, జట్టుకు అత్యుత్తమ విజయాలు అందించిన ఆటగాడిని పక్కనపెట్టి, మరీ అంత తొందరగా కొత్తవారిని తీసుకురావడం ఎంతవరకు సమంజసమని అశ్విన్ సెలెక్టర్లను, కోచింగ్ స్టాఫ్ను ప్రశ్నించారు. ఏదేమైనా సంజూ, సూర్యలను పక్కన పెట్టేసిన మేనేజ్ మెంట్.. తర్వాత మన వంతు రాదనే గ్యారెంటీ ఏంటనే ప్రశ్న టీమిండియా ఆటగాళ్లలో మొదలైందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!