Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ గెలిచిన వెంటనే సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్లను జట్టు నుంచి తొలగించడంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో కూడా ‘తర్వాతి వంతు నాదేనేమో’ అనే భయం పట్టుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ ఖేల్ జర్నలిస్ట్ విమల్ కుమార్తో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్, టీమ్ మేనేజ్మెంట్ వైఖరిని తప్పుపట్టారు.
ఆటగాళ్లలో పెరుగుతున్న అభద్రతాభావం..
సంగీతాత్మక కుర్చీల ఆటలా ఆటగాళ్లను మార్చడం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని దెబ్బతీస్తుందని అశ్విన్ అన్నారు. వరల్డ్ కప్ గెలిపించిన సంజూ, సూర్యలను హఠాత్తుగా పక్కనబెడితే, వారు నెట్స్లో ఎలా ప్రాక్టీస్ చేయగలరని ప్రశ్నించారు. ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారని, దీనివల్ల సంజూకు 3వ నంబర్ స్థానం కూడా దక్కకుండా పోయిందన్నారు. ఈ పరిస్థితి సంజూకే కాకుండా, టీమిండియా భవిష్యత్తుకు కూడా మంచిది కాదన్నారు.
Also Read
- Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
- NEET Controversy: "రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి".. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
సరైన కమ్యూనికేషన్ అవసరం
ఒకవేళ కొత్త ఆటగాడు (వైభవ్ సూర్యవంశీ) జట్టులోకి వస్తున్నప్పుడు, సీనియర్లకు స్పష్టమైన భరోసా ఇవ్వాలని అశ్విన్ సూచించారు. “నేనే గనుక ఆ స్థానంలో ఉంటే, సంజూ లేదా అభిషేక్ వద్దకు వెళ్లి… ‘కొత్త కుర్రాడు బెంచ్పై ఒత్తిడి పెంచుతున్నాడు. కానీ, మీరు మాకు వరల్డ్ కప్ గెలిపించారు కాబట్టి మీకు కనీసం 2-3 సిరీస్ల వరకు పూర్తి అవకాశం ఇస్తాం. ఆ తర్వాతే ప్రదర్శన ఆధారంగా నిర్ణయం ఉంటుంది’ అని చెప్పేవాడిని” అని అశ్విన్ పేర్కొన్నారు.
ధోనీ ఉదాహరణను గుర్తుచేసిన అశ్విన్..
భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే చరిత్రను ఒకసారి తిరగేయాలని అశ్విన్ హితవు పలికారు. గతంలో రవీంద్ర జడేజాను జట్టు నుంచి తీసేయాలని చాలా మంది అన్నప్పటికీ, ఎంఎస్ ధోనీ అతనికి అండగా నిలబడి సుదీర్ఘ అవకాశం ఇచ్చాడని, అందుకే ఈరోజు జడేజా ఒక లెజెండ్ అయ్యాడని గుర్తుచేశారు.
కుటుంబంలో ఇద్దరు పిల్లల లాంటివారే
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువగా చూడలేమని, జట్టులో అందరికీ ఒకేలా న్యాయం చేయడం కష్టమే అయినా, జట్టుకు అత్యుత్తమ విజయాలు అందించిన ఆటగాడిని పక్కనపెట్టి, మరీ అంత తొందరగా కొత్తవారిని తీసుకురావడం ఎంతవరకు సమంజసమని అశ్విన్ సెలెక్టర్లను, కోచింగ్ స్టాఫ్ను ప్రశ్నించారు. ఏదేమైనా సంజూ, సూర్యలను పక్కన పెట్టేసిన మేనేజ్ మెంట్.. తర్వాత మన వంతు రాదనే గ్యారెంటీ ఏంటనే ప్రశ్న టీమిండియా ఆటగాళ్లలో మొదలైందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
MG Comet EV: ఎంజీ కామెట్ EV కొనాలనుకుంటున్నారా? ధరలు పెంచిన కంపెనీ.. ఏ వేరియంట్పై ఎంత పెరిగిందంటే?
-
El Niño Impact: కొబ్బరిబొండాల పైనా ‘ఎల్నినో’ ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
ట్రెండింగ్
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..