Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
- ఫస్టియర్, సెకండియర్కు వేర్వేరు ప్రాక్టికల్ పరీక్షలు
- ప్రతి ఏడాది 15 మార్కులకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్
- ల్యాబ్ మాన్యువల్స్ వెబ్సైట్లో అందుబాటులో
- నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాలలపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TG BIE) సైన్స్ విద్యార్థుల సిలబస్, పరీక్షా విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రాక్టికల్స్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. నూతన విధానం ప్రకారం ఇకపై ఇంటర్ ఫస్టియర్ (ప్రథమ సంవత్సరం) సైన్స్ విద్యార్థులకు కూడా 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే సెకండియర్ (ద్వితీయ సంవత్సరం) విద్యార్థులకు కూడా 15 మార్కుల ప్రాక్టికల్ పరీక్ష కొనసాగుతుంది. అయితే థియరీ పరీక్షలు మాత్రం ఎప్పటిలాగే 60 మార్కులకే ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలు రెండింటినీ బాహ్య పరీక్షలుగానే (External Exams) బోర్డు నిర్వహిస్తుంది.
వెబ్సైట్లో ల్యాబ్ మాన్యువల్స్.. నిబంధనలు ఇవే
నూతన విధానానికి అనుగుణంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల ల్యాబ్ మాన్యువల్స్ను టీజీబీఐఈ (TG BIE) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ల్యాబ్ మాన్యువల్స్లో ప్రాక్టికల్ సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, నెలవారీ షెడ్యూల్ను పొందుపరిచారు. వార్షిక అకాడమిక్ ప్రణాళిక ప్రకారం కళాశాలల్లో ప్రాక్టికల్ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని, విద్యార్థులందరూ నిర్దేశిత ప్రయోగాలను ఖచ్చితంగా పూర్తి చేయాలని బోర్డు ఆదేశించింది. పరీక్ష సమయంలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రిన్సిపాల్/లెక్చరర్ చేత ధృవీకరించిన (Certified) ప్రాక్టికల్ రికార్డు పుస్తకాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
గంటన్నర పరీక్ష.. ల్యాబ్ సేఫ్టీ తప్పనిసరి
ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షను 15 మార్కులకు గానూ గంటన్నర (1:30 గంటలు) వ్యవధిలో నిర్వహిస్తారు. ఇంటర్ బోర్డు నియమించిన బాహ్య పరీక్షాధికారుల (External Examiners) పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ముగిసిన వెంటనే మార్కులను బోర్డు నిర్దేశించిన గడువులోపు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం కళాశాల ల్యాబ్లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, మైక్రోస్కోపులు తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని, ల్యాబ్ భద్రతా నిబంధనలను (Safety Rules) తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన అన్ని రికార్డులను కళాశాలలు భద్రపరచాలని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రాక్టికల్స్ నిర్వహణలో ఎలాంటి మాల్ప్రాక్టీస్ లేదా పరీక్షా నిబంధనల ఉల్లంఘన జరిగినా సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటారు. కళాశాలలో ప్రాక్టికల్ తరగతులు సజావుగా సాగడానికి, నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు ఆయా కళాశాల ప్రిన్సిపాల్దే పూర్తి బాధ్యత అని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!