Prakash Javadekar : కేసీఆర్ కుటుంబపాలనకు స్వస్తి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదో అవగాహన ఉందనే కుట్రపూరిత ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ ప్రకాశ్ జావదేకర్. ఇవాళ ఆయన ఢిల్లీలో ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వాస్తవానికి, బిజేపి పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగేలా, బిఆర్ఎస్, కాంగ్రెస్ లే లోపాయుకారిగా కలిసి పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని అరెస్ట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతకు ముందు బండి సంజయ్ ను కూడా నిర్బందించింది. కేసులు పెడుతోందన్నారు. ఇది నాటకం ఎలా అవుతుంది….అలా అనడం పూర్తిగా అబద్ధమన్నారు. అంతేకాకుండా.. ‘కేసీఆర్ కుటుంబపాలనకు స్వస్తి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మా వైపే ఉన్నారు. మీరే చూస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపుకు వెళ్ళిందనేది నిజం కాదు. క్షేత్రస్థాయిలో బిజేపి బలంగా ఉంది.
Also Read : BRS Leaders : బీఆర్ఎస్ అసమ్మతి నేతలు.. కోదాడలో మరోసారి ఆత్మీయ సమావేశం
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
ఎన్నికలకు బీజేపీ శ్రేణులన్నీ సమాయత్తం అవుతున్నాయు. ఓ వారంలో మొదటి విడత అభ్యర్ధుల జాబితాను ప్రకటించబోతున్నాం. అక్టోబర్ 1 నుంచి తెలంగాణ లో బిజేపి వరుసగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ప్రధాని మోడి తో సహా, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి సీనియర్ నేతలంతా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. పేదరికం నుంచి వచ్చిన ప్రధాని మోడి పేదప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. పేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ప్రధాని మోడీని తమవాడిగా భావిస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి లభించే ఉచిత బియ్యం మోడి ప్రభుత్వం ఇచ్చినవే. రానున్న 60 రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతోందో మీరే చూస్తారు. రాజకీయాలలో 60 రోజులంటే చాలా ఎక్కువ. మాదగ్గర అనేక అస్త్రాలున్నాయు…. వ్యూహాలు ఉన్నాయి. మీరే చూస్తారు. వచ్చే రెండునెలలు హైదరాబాద్ లోనే ఉంటాను. 26 వేల పోలింగ్ కేంద్రాల్లో (బూత్ లు) బీజేపీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నారు. ‘ అని ప్రకాశ్ జావదేకర్ అన్నారు.
Also Read : Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి
తాజావార్తలు
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!