ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు తరఫున సి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ప్రభాకర్ రావు వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ప్రభాకర్ రావు 30ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు.
Also Read:Kerala: పహల్గామ్ దాడిపై రెచ్చగొట్టే పోస్ట్ చేసిన “ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్” నేత..
ఎంతో విధేయతతో పనిచేయడం వల్ల అనేక గుర్తింపులు దక్కాయన్నారు. ప్రభాకర్ రావు 65ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు న్యాయవాది.. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావుకు సైతం ముందస్తు బెయిల్ మంజూరుచేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ కక్ష్య సాధింపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారని ప్రభాకర్ రావు న్యాయవాది తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది అవాస్తవమని ప్రబాకర్ రావు న్యాయవాది వెల్లడించారు.
Also Read:Pakistan: బలూచిస్తాన్లో ఆట మొదలైంది.. ఏడుగురు పాక్ సైనికులు హతం..
పోలీసుల తరఫున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. 65ఏళ్ల వయసుందన్న సాకుతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరన్నారు లూద్రా. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలున్నాయని.. హార్డ్డిస్క్లను ధ్వంసం చేసి నీళ్లలో పడేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని లూద్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని లూద్రా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.