Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
- ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
- ప్రభాకర్ రావు తరఫున సి.నిరంజన్ రెడ్డి వాదనలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు తరఫున సి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ప్రభాకర్ రావు వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ప్రభాకర్ రావు 30ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు.
Also Read:Kerala: పహల్గామ్ దాడిపై రెచ్చగొట్టే పోస్ట్ చేసిన “ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్” నేత..
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
ఎంతో విధేయతతో పనిచేయడం వల్ల అనేక గుర్తింపులు దక్కాయన్నారు. ప్రభాకర్ రావు 65ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు న్యాయవాది.. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావుకు సైతం ముందస్తు బెయిల్ మంజూరుచేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయ కక్ష్య సాధింపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారని ప్రభాకర్ రావు న్యాయవాది తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది అవాస్తవమని ప్రబాకర్ రావు న్యాయవాది వెల్లడించారు.
Also Read:Pakistan: బలూచిస్తాన్లో ఆట మొదలైంది.. ఏడుగురు పాక్ సైనికులు హతం..
పోలీసుల తరఫున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు. 65ఏళ్ల వయసుందన్న సాకుతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరన్నారు లూద్రా. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలున్నాయని.. హార్డ్డిస్క్లను ధ్వంసం చేసి నీళ్లలో పడేస్తే వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని లూద్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని లూద్రా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో