Tirumala: రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..
- రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
- గురు పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో గరుడసేవ
- ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న టీటీడీ
- రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ సేవ
- గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్న శ్రీమలయప్ప స్వామివారు.
గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. శ్రీ మలయప్ప స్వామిని వజ్ర కవచం, కిరీటం.. ఇతర ఆభరణాలతో అలంకరిస్తారు. బంగారు గరుడవాహనంపై ఆయనను అధిరోహించి.. ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు పాల్గొంటుండగా సేవకులు చత్రం, చామరాలను పట్టుకుని తిరుమల వీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
Read Also: Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
గరుడ వాహనం ప్రాముఖ్యత
గరుడుడు వరాహ స్వామి ఆజ్ఞ ప్రకారం వెంకటాద్రి కొండను తీసుకువచ్చి తిరుపతి పక్కన ఉంచాడు. దీనిని ఇప్పుడు తిరుమల కొండలుగా పిలుస్తున్నారు. గరుడ పక్షి వేంకటేశ్వరుని వాహనం. కాగా.. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి.. ఈ సమయంలో జెండా (గరుడ చిహ్నం ఉంటుంది) ఎగురవేస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోను గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని చెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెపుతున్నాడని ఆలయ పండితులు చెబుతున్నారు.
మరోవైపు.. గరుడసేవ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించేందుకు శ్రీవారి ఆలయంలో పీఠాధిపతులను అలంకరించే అరుదైన ఆభరణాలను గర్భగుడి నుండి బయటకు తీసుకువస్తారు. అరుదైన ఆభరణాలతో శ్రీ మలయప్ప స్వామి.. గరుడుని భుజాలపై గంభీరంగా కూర్చొని, ఆయన నియమిత వాహనం అయిన మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించనున్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!