Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి
- మార్చి 1న లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- అర్హులకు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు
- మీసేవ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడి
Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు.
మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..
ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, కులగణన సర్వే ద్వారా 1,51,000 దరఖాస్తులు, మీసేవ ద్వారా అర్బన్లో 15,070, రూరల్లో 12,500 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 75,000 పైచిలుకు దరఖాస్తులు రాగా, మీసేవ ద్వారా 23,000 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మాత్రమే కార్డులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న పైలట్ ప్రాజెక్టుగా 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేసింది. అయితే, మిగిలిన గ్రామాల ప్రజల్లో దీనిపై అసంతృప్తి వ్యక్తమైంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇప్పుడు కోడ్ లేని ప్రాంతాల్లో – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో – తిరిగి పంపిణీ మొదలుకానుంది. అయితే, మొత్తం లబ్ధిదారులకు కాకుండా, ముందుగా 1 లక్ష కార్డులు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా అత్యవసరంగా రేషన్ కార్డులు అవసరమైన నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 5.12 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైతే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి గడువు తేదీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవా కేంద్రాల ద్వారా రూ.50 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్తితిని తెలుసుకోవడానికి రిఫరల్ నంబర్ కూడా అందించనున్నారు.
Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్మెంట్..
తాజావార్తలు
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!