Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి
- మార్చి 1న లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- అర్హులకు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు
- మీసేవ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు.
మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..
ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, కులగణన సర్వే ద్వారా 1,51,000 దరఖాస్తులు, మీసేవ ద్వారా అర్బన్లో 15,070, రూరల్లో 12,500 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 75,000 పైచిలుకు దరఖాస్తులు రాగా, మీసేవ ద్వారా 23,000 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మాత్రమే కార్డులను అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న పైలట్ ప్రాజెక్టుగా 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేసింది. అయితే, మిగిలిన గ్రామాల ప్రజల్లో దీనిపై అసంతృప్తి వ్యక్తమైంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇప్పుడు కోడ్ లేని ప్రాంతాల్లో – ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో – తిరిగి పంపిణీ మొదలుకానుంది. అయితే, మొత్తం లబ్ధిదారులకు కాకుండా, ముందుగా 1 లక్ష కార్డులు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా అత్యవసరంగా రేషన్ కార్డులు అవసరమైన నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 5.12 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైతే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి గడువు తేదీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మీసేవా కేంద్రాల ద్వారా రూ.50 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్తితిని తెలుసుకోవడానికి రిఫరల్ నంబర్ కూడా అందించనున్నారు.
Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్మెంట్..
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!