Ponguleti: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదు.. నువ్వేదో పొడుస్తావని నిన్ను పాలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదు అని ఆయన విమర్శలు గుప్పించారు. అప్పనంగా వచ్చిన డబ్బులతో విర్రవీగాలని చూస్తున్నావు.. ఎన్ని డబ్బుల సంచులు తెచ్చావని పాలేరు ప్రజలు నిన్ను గెలిపించారో గుర్తుకు తెచ్చుకో అని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
Read Also: CM Jagan Review: ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష
Also Read
నీ అహంకారం, మదం పట్టిన మాటలు, అధికారంతో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తా అనుకుంటున్నావ్.. బెదిరించి తీసుకెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నయ్ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు పేదల ఇంటి ముందుకే వస్తాయన్నారు. మీ ముఖాలకు పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ లో టికెట్ ముందుగానే ప్రకటించడం ఉండదు.. టిక్కెట్టు ఎవరికిచ్చిన అభ్యర్థిని మనం దగ్గరుండి గెలిపించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.
Read Also: No Marriage: పెళ్లికి నో అంటున్న యువత.. కారణాలు ఇవేనా..
కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిదే పెత్తనం ఉంటుంది.. అది కేవలం రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..