Ponguleti Srinivas Reddy : ప్రజలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, అభయ హస్తంలో భాగంగా ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వారి అవసరాలు, బాధలు తెలుసుకో లేదన్నారు. ఎనిమిది రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ గ్రామానికి, వార్డుకు, అడవిలోని చెంచు గుడానికి అధికారులు వెళ్లారని, ప్రజా పాలన విజయవంతం అయ్యిందన్నారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో లోతైన చర్చ జరిగింది. కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గరకే పాలన తీసుకు వెళ్తామని ఆనాడే హామీ ఇచ్చామని, దేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కోటి 25 లక్షల అర్జీలు సేకరించాము. చిన్న సంఘటన కూడా లేకుండా నిర్వహించామన్నారు.
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ప్రతిపక్షాల నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము.ఎవరైనా కారు కూతలు కూసిన మా మాటకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
తాజావార్తలు
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!