Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు
- కీలక అంశాలపై ఫోకస్
- వృద్ధి, ఉద్యోగాలపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ప్రారంభించనుంది. 2027-28 కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను అక్టోబర్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, ఆహారం, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో సంస్కరణలను కొనసాగించడం, ఉద్యోగాల కల్పన, దేశీయ డిమాండ్ను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది.
అక్టోబర్ 12 నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలు
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన బడ్జెట్ సర్క్యులర్ 2027-28 ప్రకారం.. వ్యయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ప్రీ-బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 12, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు నవంబర్ మధ్య వరకు కొనసాగనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆర్థిక అవసరాలు, వ్యయ ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన అవసరమైన వివరాలను యూనియన్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UBIS)లో అక్టోబర్ 6, 2026లోగా లేదా అంతకంటే ముందే నమోదు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. నిర్దేశిత ఫార్మాట్లలో డేటా హార్డ్ కాపీలను కూడా క్రాస్ వెరిఫికేషన్ కోసం సమర్పించాలని తెలిపింది.
వృద్ధి, ఉద్యోగాలపై దృష్టి
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు సంస్కరణలను కొనసాగించడంపై 2027-28 బడ్జెట్లో దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల కల్పన, దేశీయ డిమాండ్ను పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత 2027-28 బడ్జెట్ అంచనాలు, 2026-27 సవరించిన అంచనాలను తాత్కాలికంగా ఖరారు చేయనున్నారు. వివిధ శాఖలతో విస్తృత చర్చలు జరిపిన అనంతరం ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలకు తాత్కాలిక వ్యయ పరిమితులను సూచించనున్నారు.
ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలు, ఆదాయ అంచనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది వ్యయ పరిమితులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించనుంది. తుది వ్యయ గణాంకాలను 2026 డిసెంబర్ చివరి నాటికి లేదా 2027 జనవరి ప్రారంభంలోగా UBISలో నమోదు చేసి ప్రతిబింబించేలా చేయనున్నారు. అలాగే కేంద్ర పన్నులు, సుంకాలు, సర్చార్జీలు, సెస్సుల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన అంచనాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు బడ్జెట్ విభాగానికి అందించాల్సి ఉంటుంది.
నిర్మలా సీతారామన్కు అరుదైన ఘనత
మోడీ 3.0 ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్ కానుంది. అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 10వ కేంద్ర బడ్జెట్ ఇదే కావడం విశేషం. భారత రాజకీయ చరిత్రలో వరుసగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడం అరుదైన ఘనతగా నిలవనుంది.
తాజావార్తలు
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!