TS Congress : కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి, జూపల్లి.. 30న ముహూర్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి ఇంట్లో చర్చలు జరిపారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిని చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఒక దూకుడైన సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంకా పెద్ద ఎత్తున చేరికలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.
Also Read : Adimulapu Suresh: చంద్రబాబుపై మంత్రి సురేష్ సెటైర్లు
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో బలంగా పార్టీని తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. బలమైన లీడర్లను చేర్చుకోగలిగితే వాళ్ల స్థాన బలంతో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి సహా బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయాత్నాల్లో కాంగ్రెస్ ఉంది.
Also Read : Atiq-Ashraf case: అతిక్ అహ్మద్ హత్య.. కిల్లర్లతో క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్
పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్ గాంధీ టీమ్ వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. దీంతో పాటు ఆయనపై ఢిల్లీ నుంచి హస్తం పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ లో చేరితేనే నెరవేరుతుందని.. ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 30వ తారీఖున వీరు చేరుతున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!