Exit Poll 2024: ఎగ్జిట్ పోల్ పై ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exit Poll 2024: 2024 లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం (1 జూన్ 2024) పలువురు జర్నలిస్టులు, కొంతమంది నాయకులపై విరుచుకుపడ్డారు. పనికిరాని చర్చలు, విశ్లేషణలతో సమయాన్ని వృథా చేయవద్దని వారిని కోరారు. చాలా ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయేకు భారీ మెజారిటీ వస్తుందని తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగలదని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ వాదించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్ 2024 ఫలితాల విడుదలకు కొన్ని గంటల ముందు, ప్రశాంత్ కిషోర్ ది ప్రింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోక్సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెరుగైన పనితీరు పై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.
Read Also:CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్కి జ్ఞానోదయం కలగలేదు!
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, “నా అంచనా ప్రకారం బిజెపి మునుపటి సంఖ్యలకు దగ్గరగా లేదా కొంచెం మెరుగ్గా తిరిగి రాబోతోంది. పశ్చిమ, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పార్టీ తన ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. తమిళనాడు, కేరళలో ఎన్డిఎ తన ఖాతాను తెరుస్తుంది. కర్ణాటకలో దాని అద్భుతమైన పనితీరు కొనసాగుతుంది. బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుముఖం పట్టవచ్చు’ అని తెలిపారు.
Read Also:Hyderabad: ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్..
కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై చెప్పుకోదగ్గ అసంతృప్తి ఏదీ లేదన్నారు. బలమైన ప్రత్యామ్నాయం లేదని ప్రశాంత్ కిషోర్ పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. బిజెపి తన మునుపటి ప్రదర్శన 303ని కొనసాగించవచ్చు లేదా దానిలో కొంత పెరుగుదల ఉండవచ్చని అంచనా వేశారు.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!