తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ నెల 28వ తేదిన నిర్వహింబడే పోలీస్ కానిస్టేబుళ్ళ రాత పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసారు.
అభ్యర్థులకు సూచనలు :