Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Eco Tourism And Film Tourism To Be Developed As Per Pawan Kalyans Vision Minister Kandula Durgesh

Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్‌ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌..

Published Date :February 7, 2026 , 12:02 pm
By Sudhakar Ravula
Minister Kandula Durgesh: పవన్ కల్యాణ్‌ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Kandula Durgesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధి చేస్తున్నాం.. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సినిమా టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

కేరళ తరహాలో హౌస్ బోట్లు
ఇక, కేరళ మోడల్‌ను అనుసరిస్తూ రాజమండ్రి, విజయవాడ నగరాల్లో హౌస్ బోట్లను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది అని కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. అయితే, గత వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నాశనమైందని మంత్రి విమర్శించారు. టూరిజంతో పాటు కళాకారులను కూడా మోసం చేశారని ఆరోపించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఇకపై ఉగాది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు.

Also Read

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..
  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌
  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్‌… ఇందులో అధిక శాతం ఉద్యోగాలు పర్యాటక శాఖ ద్వారా కల్పించాలన్నదే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతోందని మంత్రి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందన్నారు.

అమరావతిలో క్వాంటమ్ వాలీ
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ తరహాలో అమరావతిలో ‘క్వాంటమ్ వాలీ’ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.428 కోట్ల పెట్టుబడులు సమకూర్చినట్లు చెప్పారు. మరోవైపు.. 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి ప్రకటించారు. గోదావరి నది పొడవున ఎక్కడ స్నానం చేసినా పుష్కర పుణ్యం లభిస్తుందనే విధంగా ప్రచారం చేస్తామని తెలిపారు. టూరిజం, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఈ సందర్భంగా కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh eco tourism
  • AP government tourism policy
  • AP Tourism Development
  • eco tourism jobs Andhra Pradesh
  • film tourism Andhra Pradesh

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions