Hyderabad: స్థలం కబ్జాకు స్కెచ్.. ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
- రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
- ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు
- బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో రూ.4 కోట్ల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్
- ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన ముఠా.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది. ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించింది ఈ ముఠా. 14 మంది భూ మాఫియాగాళ్ళ ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు నగదు సీజ్ చేశారు.
Read Also: Maruti Suzuki : మారుతి సుజుకికి చెందిన ఈ ఆఫ్-రోడింగ్ ఎస్యూవీపై రూ. లక్ష తగ్గింపు..
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు. 2005లో చెన్నైకి చెందిన వినీత చౌదరి అనే మహిళ పద్మశ్రీ హిల్స్లో 600 గజాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. గుండా నగేశ్, జ్యూస్ ఇమాన్యూల్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. ప్రస్తుతం ఫ్లాట్ వినీతా చౌదరి పేరు మీదే ఉంది. ప్రస్తుతం ఇక్కడ లేదని నగేశ్, ఇమాన్యూల్కు చెప్పాడన్నారు. ఇద్దరు కలిసి ఈ ఫ్లాట్ను అమ్మాలని అనుకున్నారు.. ఇమాన్యూల్, నగేశ్, దివాకర్ వర్మ ముగ్గురు కలిసి కుట్ర పన్నారని డీసీపీ వెల్లడించారు. నకిలీ జీపీఏను దివాకర్ వర్మ పేరు మీద నగేశ్ క్రియేట్ చేశాడు.. మూసాపేట్లోని జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ జీపీఏను చెల్లుబాటు చేశారని పేర్కొన్నారు. ఆ జీపీఏ ఆధారంగా సుభాషిణి అనే మహిళకు దివాకర్ సేల్ డీడ్ చేశాడని అన్నారు.
Read Also: Priyanka Chopra: ముంబైలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా?
ఆ సేల్ డీడ్ ఆధారంగా ధృవతార కన్స్ట్రక్షన్స్కు నాలుగు కోట్ల రూపాయలకు అమ్మేశారని డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ధృవతార కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు గుర్తించారు. ఈ క్రమంలో ఫ్లాట్ యజమాని వినీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటి అరవై లక్షల రూపాయలు నగదుతో పాటు మూడు కార్లు, ఏడు సెల్ ఫోన్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో