Hyderabad: స్థలం కబ్జాకు స్కెచ్.. ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
- రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
- ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు
- బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో రూ.4 కోట్ల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్
- ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన ముఠా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది. ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించింది ఈ ముఠా. 14 మంది భూ మాఫియాగాళ్ళ ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు నగదు సీజ్ చేశారు.
Read Also: Maruti Suzuki : మారుతి సుజుకికి చెందిన ఈ ఆఫ్-రోడింగ్ ఎస్యూవీపై రూ. లక్ష తగ్గింపు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు. 2005లో చెన్నైకి చెందిన వినీత చౌదరి అనే మహిళ పద్మశ్రీ హిల్స్లో 600 గజాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. గుండా నగేశ్, జ్యూస్ ఇమాన్యూల్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. ప్రస్తుతం ఫ్లాట్ వినీతా చౌదరి పేరు మీదే ఉంది. ప్రస్తుతం ఇక్కడ లేదని నగేశ్, ఇమాన్యూల్కు చెప్పాడన్నారు. ఇద్దరు కలిసి ఈ ఫ్లాట్ను అమ్మాలని అనుకున్నారు.. ఇమాన్యూల్, నగేశ్, దివాకర్ వర్మ ముగ్గురు కలిసి కుట్ర పన్నారని డీసీపీ వెల్లడించారు. నకిలీ జీపీఏను దివాకర్ వర్మ పేరు మీద నగేశ్ క్రియేట్ చేశాడు.. మూసాపేట్లోని జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ జీపీఏను చెల్లుబాటు చేశారని పేర్కొన్నారు. ఆ జీపీఏ ఆధారంగా సుభాషిణి అనే మహిళకు దివాకర్ సేల్ డీడ్ చేశాడని అన్నారు.
Read Also: Priyanka Chopra: ముంబైలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా?
ఆ సేల్ డీడ్ ఆధారంగా ధృవతార కన్స్ట్రక్షన్స్కు నాలుగు కోట్ల రూపాయలకు అమ్మేశారని డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ధృవతార కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు గుర్తించారు. ఈ క్రమంలో ఫ్లాట్ యజమాని వినీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటి అరవై లక్షల రూపాయలు నగదుతో పాటు మూడు కార్లు, ఏడు సెల్ ఫోన్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!