Hyderabad: స్థలం కబ్జాకు స్కెచ్.. ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
- రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
- ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు
- బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో రూ.4 కోట్ల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్
- ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన ముఠా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు సభ్యులు గల ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ముఠా స్కెచ్ వేసింది. ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించింది ఈ ముఠా. 14 మంది భూ మాఫియాగాళ్ళ ఆట కట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు నగదు సీజ్ చేశారు.
Read Also: Maruti Suzuki : మారుతి సుజుకికి చెందిన ఈ ఆఫ్-రోడింగ్ ఎస్యూవీపై రూ. లక్ష తగ్గింపు..
Also Read
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు. 2005లో చెన్నైకి చెందిన వినీత చౌదరి అనే మహిళ పద్మశ్రీ హిల్స్లో 600 గజాల భూమిని కొనుగోలు చేసిందని తెలిపారు. గుండా నగేశ్, జ్యూస్ ఇమాన్యూల్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు.. ప్రస్తుతం ఫ్లాట్ వినీతా చౌదరి పేరు మీదే ఉంది. ప్రస్తుతం ఇక్కడ లేదని నగేశ్, ఇమాన్యూల్కు చెప్పాడన్నారు. ఇద్దరు కలిసి ఈ ఫ్లాట్ను అమ్మాలని అనుకున్నారు.. ఇమాన్యూల్, నగేశ్, దివాకర్ వర్మ ముగ్గురు కలిసి కుట్ర పన్నారని డీసీపీ వెల్లడించారు. నకిలీ జీపీఏను దివాకర్ వర్మ పేరు మీద నగేశ్ క్రియేట్ చేశాడు.. మూసాపేట్లోని జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ జీపీఏను చెల్లుబాటు చేశారని పేర్కొన్నారు. ఆ జీపీఏ ఆధారంగా సుభాషిణి అనే మహిళకు దివాకర్ సేల్ డీడ్ చేశాడని అన్నారు.
Read Also: Priyanka Chopra: ముంబైలో ఆస్తులు అమ్మేస్తున్న ప్రియాంక చోప్రా?
ఆ సేల్ డీడ్ ఆధారంగా ధృవతార కన్స్ట్రక్షన్స్కు నాలుగు కోట్ల రూపాయలకు అమ్మేశారని డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ధృవతార కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు గుర్తించారు. ఈ క్రమంలో ఫ్లాట్ యజమాని వినీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటి అరవై లక్షల రూపాయలు నగదుతో పాటు మూడు కార్లు, ఏడు సెల్ ఫోన్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..