Bengaluru : బెంగళూరులో భారీ వర్షాలు.. కూలిపోయిన పోలీసు ఆయుధశాల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది. దీనితో వర్షపు నీరు గది లోకి ప్రవేశించింది. గది లోకి నీరు చేరడం వల్ల గదిలో ఉన్న ఆయుధాలు అన్నీ జలమయం అయ్యాయి. గది లోకి నీరు చేరడంతో గదిలో ఉన్న SLR రైఫిల్, AK47, 9 mm పిస్టల్ మరియు పంప్ యాక్షన్ గన్ సహా 210 ఆయుధాలు దెబ్బతిన్నాయి.
Read also:Samantha: ‘బజార్’ కోసం మళ్ళీ హద్దులు దాటేసిన సమంత
Also Read
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
ఈ నేపథ్యంలో వర్షపు నీటిలో తేలుతున్న ఆయుధాలను పోలీసు సిబ్బంది పొడి ప్రాంతానికి తరలించారు. తుపాకుల్లోకి నీరు, ధూళి ప్రవేశించాయి. దీనితో సాయుధ రిజర్వ్ సిబ్బంది తడిసిన తుపాకులను శుభ్రం చేసి వాటిని పొడి ప్రాంతంలో ఆరబెట్టారు. కాగా వర్షపు నీరు గదిలోకి ప్రవేశించడం వల్ల లక్షల రూపాయలు విలువ గల ఆయుధాలు దెబ్బతిన్నాయి. తడిసిన ఆయుధాలను శుభ్రం చేయడానికి, ఆరబెట్టడానికి సిబ్బంది చాల ఇబ్బంది పడ్డారు అని సమాచారం. నాసిరకం పనుల వల్లే గోడ కూలిపోయిందని పోలీసు సిబ్బంది ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!
-
Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
-
China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!