Rahul Gandhi: పార్లమెంట్లో ప్రధాని ప్రసంగంపై రాహుల్గాంధీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్లో దాదాపు 2 గంటల 13 నిమిషాలు మాట్లాడిన ప్రధాని.. చివరకు మణిపూర్ అంశంపై 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారని రాహుల్ గాంధీ విమర్శించారు. “మణిపూర్ నెలల తరబడి కాలిపోతోంది, ప్రజలను చంపుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ ప్రధాని నవ్వుతున్నారు. , జోకులు పేలుస్తున్నారు.. అది ఆయనకు సరిపోదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం రెండు రోజుల్లో ఈ పనికిమాలిన పనిని ఆపగలదని, కానీ ప్రధాని మణిపూర్ను తగలబెట్టాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మంటలను ఆర్పడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. 2028లో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 2024లో మోడీ ప్రధాని అవుతారా అనేది ప్రశ్న కాదని.. పిల్లలు, ప్రజలు చంపబడుతున్న మణిపూర్ అంశమే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ ప్రసంగం భారతదేశం గురించి కాదని, నరేంద్ర మోడీ గురించి అంటూ రాహుల్ మండిపడ్డారు. ఆయన తన అభిప్రాయాలు, తమ రాజకీయాలు, ఆశయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
Also Read: Independence Day: ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగే ప్రదేశాలు
ప్రధానమంత్రి కనీసం మణిపూర్కు వెళ్లి సంఘాలతో మాట్లాడి మీ ప్రధానమంత్రిని అని చెప్పవచ్చని.. ఆ సమస్యను పరిష్కరించవచ్చని, కానీ అలాంటి ఉద్దేశం ఎక్కడా కనిపించలేదని రాహుల్ ఆరోపించారు. ప్రధాని చేతిలో ఎన్నో హింసను అంతం చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని మోడీ ఉపయోగించడం లేదని ఆయన అన్నారు. మణిపూర్లో హింస చెలరేగిపోతోందని, ఆ హింసను అరికట్టడం ప్రధానిగా ఆయన మొదటి కర్తవ్యమని.. కానీ ఆయన ఏమీ చేయకుండా నవ్వుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్పై వ్యాఖ్యానిస్తూ.. ‘ప్రభుత్వం ఎంపీలను సస్పెండ్ చేసినా తమ పని మారదని, మణిపూర్లో హింసను అరికట్టడమే మా పని’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!