PM Modi: మైనారిటీ శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందంటున్న పీఎం మోడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. దింతో లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వారి నియోజవర్గాలలో పెద్దపెద్ద మీటింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే..
Also Read: Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్’ వెహికిల్స్కు జీపీఎస్..!
Also Read
ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించాయి. దాంతో సదురు అభ్యర్థులు వారి నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రసంగాలు చేస్తూ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రచారంలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధించారు. మైనారిటీ శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: TDP: విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించిన టీడీపీ.. మొదటి డొనేషన్ ఎంతో తెలుసా..?
నేడు ఇదే స్ఫూర్తి, శక్తితో మనం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను ఆవిష్కరించే దిశగా తీర్మానం తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇకపోతే అయోధ్య నగరంలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేస్తోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ప్రపంచం నేడు పలు సమస్యలతో సతమతమవుతుండగా.. భారతదేశం మాత్రం తనకు అసాధ్యమైనది ఏమీ లేదంటూ చాటుతోందని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లో బీజేపీ అభ్యర్ధి జితిన్ ప్రసాదకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!