PM Modi: భారత్లో ఆ కఠినమైన విధానం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు. వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలనను పెంపొందించడంలో భారత్ కు బలమైన నిబద్ధత ఉందని పునరుద్ఘాటించారు. పారదర్శకమైన-జవాబుదారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి భారతదేశం సాంకేతికత-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించుకుంటోందని తెలిపారు. అంతేకాకుండా.. ప్రధాని ప్రారంభోపన్యాసంలో కవి, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణాత్మక సందేశాన్ని ప్రస్తావించారు. అవినీతి వల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలపై దాని అసమాన ప్రభావాన్ని ఎత్తిచూపారు. వనరుల కేటాయింపు, మార్కెట్ సమతౌల్యం, కీలకమైన ప్రజాసేవల క్షీణతపై దృష్టి సారించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.
Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి
Also Read
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
భారతదేశ దృఢమైన వైఖరిని మోడీ పునరుద్ఘాటించారు. బాధ్యతాయుతమైన-పారదర్శకమైన పరిపాలనా చట్టాన్ని స్థాపించడానికి దేశం సాంకేతిక పరిజ్ఞానం-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించాలని ప్రధాని చెప్పారు. ఈ సమగ్ర విధానం వల్ల సంక్షేమ కార్యక్రమాలలో అసమర్థత-లీకేజీలను నిరోధించిందని.. దాంతో మిలియన్ల మంది పౌరులకు 360 బిలియన్ డాలర్లకు పైగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ఆటోమేట్ చేయడంలో విజయవంతమయ్యాయని.. వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో భారతదేశం పురోగతిని వివరించారు. ఆర్థిక నేరస్థులు, పారిపోయిన వారి నుంచి గణనీయమైన ఆస్తుల రికవరీకి వీలు కల్పించినందుకు ఆర్థిక నేరస్థుల చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం సమర్థతను ప్రధాని మోడీ కొనియాడారు.
Yogi Adityanath: బీజేపీ భవిష్యత్ విజయాలపై కీలక జోస్యం చెప్పిన యోగి
2014లో జీ-20 శిఖరాగ్ర సదస్సులో విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రధాని తన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కొనేందుకు, ఆస్తుల రికవరీ ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు 2018లో సమగ్ర తొమ్మిది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. సీమాంతర నేరస్థులు ఉపయోగించుకునే చట్టపరమైన లొసుగులను తొలగించడానికి చట్ట అమలులో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోడీ కోరారు. జీ-20 దేశాల సమిష్టి ప్రయత్నాలు అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి గణనీయంగా మద్దతు ఇవ్వగలవనీ, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం, అవినీతి మూల కారణాలను పరిష్కరించే బలమైన చర్యలను అమలు చేయడం ద్వారా భారీ తేడాను సాధించవచ్చని ప్రధాని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!