PM Modi: భారత్లో ఆ కఠినమైన విధానం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు. వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలనను పెంపొందించడంలో భారత్ కు బలమైన నిబద్ధత ఉందని పునరుద్ఘాటించారు. పారదర్శకమైన-జవాబుదారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి భారతదేశం సాంకేతికత-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించుకుంటోందని తెలిపారు. అంతేకాకుండా.. ప్రధాని ప్రారంభోపన్యాసంలో కవి, నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణాత్మక సందేశాన్ని ప్రస్తావించారు. అవినీతి వల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలపై దాని అసమాన ప్రభావాన్ని ఎత్తిచూపారు. వనరుల కేటాయింపు, మార్కెట్ సమతౌల్యం, కీలకమైన ప్రజాసేవల క్షీణతపై దృష్టి సారించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.
Ashu Reddy: వైట్ మినీ స్కర్ట్ డ్రెస్సులో అదరహో అనిపిస్తున్న అషు రెడ్డి
Also Read
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
భారతదేశ దృఢమైన వైఖరిని మోడీ పునరుద్ఘాటించారు. బాధ్యతాయుతమైన-పారదర్శకమైన పరిపాలనా చట్టాన్ని స్థాపించడానికి దేశం సాంకేతిక పరిజ్ఞానం-ఇ-గవర్నెన్స్ ను ఉపయోగించాలని ప్రధాని చెప్పారు. ఈ సమగ్ర విధానం వల్ల సంక్షేమ కార్యక్రమాలలో అసమర్థత-లీకేజీలను నిరోధించిందని.. దాంతో మిలియన్ల మంది పౌరులకు 360 బిలియన్ డాలర్లకు పైగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను ఆటోమేట్ చేయడంలో విజయవంతమయ్యాయని.. వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో భారతదేశం పురోగతిని వివరించారు. ఆర్థిక నేరస్థులు, పారిపోయిన వారి నుంచి గణనీయమైన ఆస్తుల రికవరీకి వీలు కల్పించినందుకు ఆర్థిక నేరస్థుల చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం సమర్థతను ప్రధాని మోడీ కొనియాడారు.
Yogi Adityanath: బీజేపీ భవిష్యత్ విజయాలపై కీలక జోస్యం చెప్పిన యోగి
2014లో జీ-20 శిఖరాగ్ర సదస్సులో విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రధాని తన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక నేరగాళ్లను ఎదుర్కొనేందుకు, ఆస్తుల రికవరీ ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు 2018లో సమగ్ర తొమ్మిది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. సీమాంతర నేరస్థులు ఉపయోగించుకునే చట్టపరమైన లొసుగులను తొలగించడానికి చట్ట అమలులో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోడీ కోరారు. జీ-20 దేశాల సమిష్టి ప్రయత్నాలు అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి గణనీయంగా మద్దతు ఇవ్వగలవనీ, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం, అవినీతి మూల కారణాలను పరిష్కరించే బలమైన చర్యలను అమలు చేయడం ద్వారా భారీ తేడాను సాధించవచ్చని ప్రధాని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
-
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్బస్టర్ హిట్.. నాన్న చరణ్కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!