PM Modi: పాక్తో యుద్ధం తర్వాత 93 వేల సైనికులు సరెండర్ అయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు. పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు. కానీ… వారికి ఆ ఆలోచనే రాలేదని చెప్పారు.
‘‘మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత్ సరిహద్దుకు అవతల కర్తార్పూర్ సాహిబ్ ఉంది. మనవైపు ఒక టవర్ కట్టారు. టవరెక్కి సిక్కులు దుర్బణిలో చూసి దర్శించుకునేవారు. నేను పంజాబ్లో పనిచేస్తున్నప్పుడు
ఇంత అవమానాన్ని ఎలా సహిస్తున్నారని అనుకునేవాడిని. నేను వచ్చాక పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నించాను. ఒక దారి దొరికింది ఇప్పుడు సిక్కులు వెళ్లి హాయిగా దర్శించుకుంటున్నారు. చారిత్రక ప్రదేశాలకు చాలా విశిష్టత ఉంటుంది.’’ అని తెలిపారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
అంబేద్కర్ గురించి మాట్లాడుతూ..
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్కు సంబంధించి పంచతీర్థాల అభివృద్ధిపై నేను దృష్టి పెట్టాను. అంబేద్కర్ జన్మించిన ప్రాంతం.. ఆయన యూకేలో నివసించిన ప్రాంతం. అంబేద్కర్ దీక్ష స్వీకరించిన చోటు.. ఆయన పని చేసిన ప్రాంతం. ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన పుణ్యప్రదేశం. ఈ ఐదు ప్రాంతాలను నేను చాలా బాగా అభివృద్ధి చేశాను. ఒకచోట ఇంకా పని జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ జీవన చిత్రాన్ని అవగాహన చేసుకునేందుకు పంచ్ దీక్ష యాత్ర ఉపయోగపడుతుంది.’’ అని వివరించారు
‘‘స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టమైన దండి ఉద్యమాన్ని అంతా విస్మరించారు. నేను దండి ఉద్యమాన్ని మళ్లీ కళ్లకు కట్టేలా పునర్నిర్మించాను. ప్రపంచం భారతదేశాన్ని ఒకమహాశక్తిగా చూడాలన్నది నా కోరిక. అదే స్టాట్యూ ఆప్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే అది రెండింతల పెద్ద విగ్రహం. టూరిజాన్ని డెవలప్ చేయడం.. ముఖ్యమైన ప్రదేశాలను పునరుద్ధరించడం.. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. దేశ ప్రతిష్టను పెంచుతాయి. అందుకోసం మేం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
- Tags
- ntv
- NTV Telugu
- Pakistan
- PM Modi
- Reacts
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!