Doctors advised: ప్రచారంతో పరేషాన్ కాకండి.. జర ఆరోగ్యం కూడా చూస్కోండి సారూ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నకల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నకల వ్యవహారం వాడివేడి మీద సాగుతుంది. ప్రతి పార్టీ నేతలు గెలవాలనే కాక్షిస్తున్నారు. గెలుపు కోసం రాత్రి పగలు మర్చిపోయి సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనదిగా పార్టీ కోసం పని చేస్తూ నిద్రాహారాలు మాని ప్రచారంలో పాల్గొంటున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా గెలుపే ధ్యేయంగా ప్రచారంలో ముగిపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలు, ప్రచారాల్లో తిరుగుతున్నారు. దీనితో చెమట రూపంలో శరీరంలోని నీరంతా పోయి డీహ్రైడేషన్ ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also:SBI recruitment 2023: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
అలానే ప్రచారంలో భాగంగా ఎక్కువ సేపు బయట తిరగడం వల్ల నీరసం, నాలుక తడారిపోవడం, మూత్రం రంగు మారడం లాంటి లక్షణాలు కన్పిస్తే.. నీళ్లు మాత్రమే కాకుండా ఓఆర్ఎస్, ఉప్పు, చక్కెర కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకుంటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. అలానే దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి అధిక రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు పేర్కొంటున్నారు. అలానే ఉద్యమ అల్పాహారం అశ్రద్ధ చేయకూడదని.. తాజా కూరగాయలు పండ్లు ఇతర డ్రైఫూట్స్, ఎక్కువ పీచుఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని, కాఫీలు, టీలు ఎక్కువగా తాగక పోవడమే మంచిదని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!