PM Modi Praised: హాకీ కెప్టెన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు..
- ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశం
- ప్రధాని నివాసంలో వారిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
- భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించిన ప్రధాని
- హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ను ప్రశంసించిన మోడీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ గేమ్స్లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశమయ్యారు. అథ్లెట్లందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.. అక్కడ వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించారు. భారత రిటైర్డ్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా.. హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ను ప్రధాని ప్రశంసించారు. ప్రధాని మోడీ శ్రీజేష్ను అడిగారు.. మీరు పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారా అడగగా.. దీనిపై శ్రీజేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆలోచిస్తున్నాను. తన సోదరుడు, సహచరులు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించమని అడిగారన్నారు. తాను 2002లో తొలిసారిగా క్యాంప్కు వెళ్లి 2004లో జూనియర్ జట్టుతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడానని శ్రీజేష్ తెలిపారు. అప్పటి నుంచి 20 ఏళ్లుగా దేశం తరఫున ఆడుతున్నాను.. రిటైరయ్యేందుకు ఇదే మంచి వేదిక అని శ్రీజేష్ పేర్కొన్నారు.
Read Also: Harish Rao : కలకలం రేపుతున్న హరీష్ రావు ఫ్లెక్సీలు
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ఆ తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ బృందం మిమ్మల్ని ఖచ్చితంగా కోల్పోతుంది, కానీ ఈ బృందం మీకు అద్భుతమైన వీడ్కోలు ఇచ్చింది. ఇది మొత్తం టీమ్కి అభినందనలు.’ ఆ తర్వాత శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘సెమీఫైనల్స్లో ఓడిపోయినప్పుడు మాకు కొంచెం కష్టమైంది. ఎందుకంటే పారిస్ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తామని వెళ్లాం. సెమీఫైనల్లో ఓడిపోయినప్పుడు అందరికీ కాస్త బాధ అనిపించినా, చివరి మ్యాచ్ ఆడుతున్న శ్రీజేష్ భాయ్కి ఈ మ్యాచ్ గెలవాలని అందరూ అన్నారు. నాకెంతో గర్వకారణం.. నేను 17 సంవత్సరాలుగా భారతదేశం కోసం ఆటలో పాల్గొన్నాను, నా స్నేహితులు నాకు మద్దతు ఇచ్చారు. నా జట్టు ఆ వేదికపై నిలబడటం నాకు గర్వకారణం.’ అని శ్రీజేష్ తెలిపారు.
Read Also: Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధిస్తుందని భావించినా.. స్వర్ణం రాకపోయినా కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్ను ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత హకీలో భారత్ స్వర్ణం సాధించలేదు. ఒలింపిక్స్లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన క్రీడ హాకీ. హాకీలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 13 పతకాలు సాధించగా అందులో ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.
#WATCH | PM Narendra Modi interacted with PR Sreejesh, who played the final match of his career at the Bronze-winning Hockey match at the Paris Olympics, during his interaction with the Indian Olympic contingent at his residence. pic.twitter.com/of12RIQLuj
— ANI (@ANI) August 16, 2024
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!