PM Modi Praised: హాకీ కెప్టెన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు..
- ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశం
- ప్రధాని నివాసంలో వారిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
- భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించిన ప్రధాని
- హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ను ప్రశంసించిన మోడీ.
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ గేమ్స్లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ భారత అథ్లెట్లతో సమావేశమయ్యారు. అథ్లెట్లందరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.. అక్కడ వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టుతో మాట్లాడి వారిని ప్రశంసించారు. భారత రిటైర్డ్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా.. హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ను ప్రధాని ప్రశంసించారు. ప్రధాని మోడీ శ్రీజేష్ను అడిగారు.. మీరు పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారా అడగగా.. దీనిపై శ్రీజేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆలోచిస్తున్నాను. తన సోదరుడు, సహచరులు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించమని అడిగారన్నారు. తాను 2002లో తొలిసారిగా క్యాంప్కు వెళ్లి 2004లో జూనియర్ జట్టుతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడానని శ్రీజేష్ తెలిపారు. అప్పటి నుంచి 20 ఏళ్లుగా దేశం తరఫున ఆడుతున్నాను.. రిటైరయ్యేందుకు ఇదే మంచి వేదిక అని శ్రీజేష్ పేర్కొన్నారు.
Read Also: Harish Rao : కలకలం రేపుతున్న హరీష్ రావు ఫ్లెక్సీలు
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ఆ తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ బృందం మిమ్మల్ని ఖచ్చితంగా కోల్పోతుంది, కానీ ఈ బృందం మీకు అద్భుతమైన వీడ్కోలు ఇచ్చింది. ఇది మొత్తం టీమ్కి అభినందనలు.’ ఆ తర్వాత శ్రీజేష్ మాట్లాడుతూ.. ‘సెమీఫైనల్స్లో ఓడిపోయినప్పుడు మాకు కొంచెం కష్టమైంది. ఎందుకంటే పారిస్ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తామని వెళ్లాం. సెమీఫైనల్లో ఓడిపోయినప్పుడు అందరికీ కాస్త బాధ అనిపించినా, చివరి మ్యాచ్ ఆడుతున్న శ్రీజేష్ భాయ్కి ఈ మ్యాచ్ గెలవాలని అందరూ అన్నారు. నాకెంతో గర్వకారణం.. నేను 17 సంవత్సరాలుగా భారతదేశం కోసం ఆటలో పాల్గొన్నాను, నా స్నేహితులు నాకు మద్దతు ఇచ్చారు. నా జట్టు ఆ వేదికపై నిలబడటం నాకు గర్వకారణం.’ అని శ్రీజేష్ తెలిపారు.
Read Also: Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధిస్తుందని భావించినా.. స్వర్ణం రాకపోయినా కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్ను ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత హకీలో భారత్ స్వర్ణం సాధించలేదు. ఒలింపిక్స్లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన క్రీడ హాకీ. హాకీలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 13 పతకాలు సాధించగా అందులో ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.
#WATCH | PM Narendra Modi interacted with PR Sreejesh, who played the final match of his career at the Bronze-winning Hockey match at the Paris Olympics, during his interaction with the Indian Olympic contingent at his residence. pic.twitter.com/of12RIQLuj
— ANI (@ANI) August 16, 2024
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో