PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
- ప్రధానమంత్రి మహారాష్ట్రలో ఒకరోజు పర్యటన.
- దాదాపు రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు.
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత విడుదల .
PM Modi Maharashtra Tour: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈరోజు (శనివారం) ప్రధానమంత్రి మహారాష్ట్రలో ఒకరోజు పర్యటనకు రానున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటనలో వాషిం నుంచి ముంబై, థానే వరకు దాదాపు రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వాషిమ్లో వ్యవసాయం, పశుసంవర్ధక రంగం పురోగతికి రూ. 23 వేల 300 కోట్లు, థానేలో పట్టణ అభివృద్ధికి రూ. 32 వేల 800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు.
Haryana Assembly Election 2024: 90 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓటింగ్
Also Read
వ్యవసాయం, పశుసంవర్ధక రంగానికి సంబంధించి దాదాపు రూ.23 వేల 300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వాషిమ్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఆరే JVLR నుండి BKC వరకు ముంబై మెట్రో లైన్ 3 ఫేజ్ 1 సెక్షన్ ప్రారంభోత్సవం కూడా ఇందులో ఉంది. దాదాపు రూ.12 వేల 200 కోట్లతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత విడుదల కానుంది. దీంతో పాటు 5వ విడత ‘షేత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. దీని కింద సుమారు రూ.2000 కోట్లు పంపిణీ చేయనున్నారు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సుమారు రూ.1920 కోట్ల విలువైన 7500 ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు.
IND W vs NZ W: ప్రపంచ కప్లో భారత్ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
1300 కోట్ల రూపాయల టర్నోవర్తో 9200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పిఓ) ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు. బంజారా కమ్యూనిటీ యొక్క గొప్ప వారసత్వానికి చిహ్నంగా ఉన్న బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని మొత్తం పొడవు 29 కిలోమీటర్లు. ఇందులో 20 ఎలివేటెడ్, రెండు భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. రూ. 3310 కోట్లతో చేదా నగర్ నుండి ఆనంద్ నగర్, థానే వరకు ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే ఎక్స్టెన్షన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణ ముంబై నుండి థానేకి కనెక్టివిటీని అందిస్తుంది.
कल महाराष्ट्र में कई परियोजनाओं के उद्घाटन और शिलान्यास में विकास और विरासत का संगम दिखेगा। सुबह करीब 11.30 बजे वाशिम में बंजारा विरासत म्यूजियम के लोकार्पण के बाद किसानों के कार्यक्रम का हिस्सा बनूंगा। इसके बाद ठाणे में विकास कार्यक्रम में शामिल होऊंगा।https://t.co/QVzeLqJokt
— Narendra Modi (@narendramodi) October 4, 2024
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?