PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
- ప్రధానమంత్రి మహారాష్ట్రలో ఒకరోజు పర్యటన.
- దాదాపు రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు.
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత విడుదల .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Maharashtra Tour: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈరోజు (శనివారం) ప్రధానమంత్రి మహారాష్ట్రలో ఒకరోజు పర్యటనకు రానున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటనలో వాషిం నుంచి ముంబై, థానే వరకు దాదాపు రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వాషిమ్లో వ్యవసాయం, పశుసంవర్ధక రంగం పురోగతికి రూ. 23 వేల 300 కోట్లు, థానేలో పట్టణ అభివృద్ధికి రూ. 32 వేల 800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు.
Haryana Assembly Election 2024: 90 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓటింగ్
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
వ్యవసాయం, పశుసంవర్ధక రంగానికి సంబంధించి దాదాపు రూ.23 వేల 300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వాషిమ్లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఆరే JVLR నుండి BKC వరకు ముంబై మెట్రో లైన్ 3 ఫేజ్ 1 సెక్షన్ ప్రారంభోత్సవం కూడా ఇందులో ఉంది. దాదాపు రూ.12 వేల 200 కోట్లతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత విడుదల కానుంది. దీంతో పాటు 5వ విడత ‘షేత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. దీని కింద సుమారు రూ.2000 కోట్లు పంపిణీ చేయనున్నారు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సుమారు రూ.1920 కోట్ల విలువైన 7500 ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు.
IND W vs NZ W: ప్రపంచ కప్లో భారత్ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
1300 కోట్ల రూపాయల టర్నోవర్తో 9200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్పిఓ) ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు. బంజారా కమ్యూనిటీ యొక్క గొప్ప వారసత్వానికి చిహ్నంగా ఉన్న బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని మొత్తం పొడవు 29 కిలోమీటర్లు. ఇందులో 20 ఎలివేటెడ్, రెండు భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. రూ. 3310 కోట్లతో చేదా నగర్ నుండి ఆనంద్ నగర్, థానే వరకు ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే ఎక్స్టెన్షన్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణ ముంబై నుండి థానేకి కనెక్టివిటీని అందిస్తుంది.
कल महाराष्ट्र में कई परियोजनाओं के उद्घाटन और शिलान्यास में विकास और विरासत का संगम दिखेगा। सुबह करीब 11.30 बजे वाशिम में बंजारा विरासत म्यूजियम के लोकार्पण के बाद किसानों के कार्यक्रम का हिस्सा बनूंगा। इसके बाद ठाणे में विकास कार्यक्रम में शामिल होऊंगा।https://t.co/QVzeLqJokt
— Narendra Modi (@narendramodi) October 4, 2024
తాజావార్తలు
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!