PM Modi: షిర్డీలోని సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని నీల్వాండే డ్యామ్కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జల పూజ చేశారు. అనంతరం ఆనకట్ట ఎడమ గట్టుకు సంబంధించిన కాలువ నెట్వర్క్ను ఆయన ప్రారంభించారు. దీనికి ముందు ఆయన షిర్డీలోని ప్రసిద్ధ శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీని తర్వాత కొత్త ‘దర్శన్ ఖతార్ కాంప్లెక్స్’ను ప్రారంభించడం ద్వారా ఆయన మహారాష్ట్ర పర్యటనను ప్రారంభించారు. రూ. 7,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులతో పాటు 86 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చే ‘నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ఈ రోజు సాయంత్రం 37వ జాతీయ క్రీడలను ప్రారంభించేందుకు గోవాకు వెళ్లనున్నారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
నీల్వాండే డ్యామ్ ప్రయోజనాలు: నీటి పైపుల పంపిణీ నెట్వర్క్ సౌకర్యంతో ఏడు తహసీల్లలోని 182 గ్రామాలకు (అహ్మద్నగర్ జిల్లాలో 6, నాసిక్ జిల్లాలో 1) ప్రయోజనం చేకూరుతుంది. నీల్వాండే డ్యామ్ ఆలోచన మొదట 1970లో వచ్చింది. దాదాపు రూ.5177 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
Also Read: Encounter: ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. చొరబాటు యత్నం భగ్నం
ప్రధాన మంత్రి ‘నమో షెత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ను ప్రారంభించారు.. ఈ పథకం ద్వారా, మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 86 లక్షల మంది లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.6000 అదనంగా అందించబడుతుంది. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వీటిలో అహ్మద్నగర్ సివిల్ హాస్పిటల్లోని ఆయుష్ హాస్పిటల్, కుర్దువాడి-లాతూర్ రోడ్ రైల్వే సెక్షన్ విద్యుదీకరణ (186 కి.మీ), జల్గావ్ నుండి భుసావల్ (24.46 కి.మీ), సాంగ్లీ నుండి బోర్గావ్ సెక్షన్ (ప్యాకేజీ-I) NH-166 (ప్యాకేజీ-I) వరకు కలుపుతూ మూడు, నాల్గవ రైల్వే లైన్లు ఉన్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మన్మాడ్ టెర్మినల్లో నాలుగు లేనింగ్, అదనపు సౌకర్యాలు ఉన్నాయి.
#WATCH | PM Modi offers prayers at Shri Saibaba Samadhi Temple in Maharashtra's Shirdi
Maharashtra Governor Ramesh Bais, CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis are also present pic.twitter.com/khMOQhNtjc
— ANI (@ANI) October 26, 2023
ప్రధాని మోడీ షెడ్యూల్
మహారాష్ట్ర:
1:00 PM: అహ్మద్నగర్ జిల్లా షిర్డీకి చేరుకోవడం.
1:30 PM: శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రార్థన, దర్శనం.
2:00 PM: ఆలయం వద్ద దర్శన క్యూ కాంప్లెక్స్ ప్రారంభం.
2:30 PM: నీల్వాండే డ్యామ్ జల పూజ (జల ప్రతిష్ట).
3:15 PM: 7500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
ప్రధాని మోదీ షెడ్యూల్
గోవా:
6:30 PM: గోవా చేరుకుంటారు.
6:45 PM: మార్గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం.
7:30 PM: గేమ్స్లో పాల్గొనే క్రీడాకారులను అడ్రెస్స్ చేస్తారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!