Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Meets Diplomatic Delegations In Delhi

PM Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం పంపించారు.. ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ

Published Date :June 11, 2025 , 8:41 am
By Suresh Maddala
  • ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం పంపించారు
  • ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ
PM Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం పంపించారు.. ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు అధికార-ప్రతిపక్షాలతో కూడిన ఏడు బృందాలను ఆయా దేశాలకు కేంద్రం పంపించింది. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ అధినేతలకు వివరించారు. అయితే మంగళవారం ప్రధాని మోడీ తన నివాసంలో దౌత్య బృందాలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దౌత్య బృందాలతో ప్రత్యేకంగా చర్చించారు. దౌత్య బృందాలను ప్రత్యేకంగా మోడీ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన

దౌత్య బృందంలో ఇంత మంది ప్రతిపక్ష సభ్యులు ఉండడం గొప్ప విషయం అని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని ప్రపంచానికి ఒక పెద్ద సందేశం పంపించినట్లు మోడీ పేర్కొ్న్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పర్యటనలు మరిన్ని ఉండాలని అభిప్రాయపడ్డారు. దౌత్య బృందాలు.. 33 విదేశీ రాజధానులు, యూరోపియన్‌ యూనియన్‌ను సందర్శించారు. ఈ బృందంలో తాజా ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.

‘‘వివిధ దేశాల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధుల బృందాలను కలిశాను. శాంతి పట్ల భారతదేశం యొక్క నిబద్ధత, ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరాన్ని వివరించారు. భారతదేశం యొక్క స్వరాన్ని ప్రపంచ దేశాలకు తీసుకెళ్లిన తీరు పట్ల మనమందరం గర్విస్తున్నాము.’’ అని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే ప్రతినిధులను కలిశారు. దౌత్య బృందాలను ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ACB Raids: ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు..!

ప్రధాని మోడీ దౌత్య బృందాలతో ఆహ్లాదకరంగా గడిపారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. అందరితో గంట పాటు గడిపారని.. పచ్చిక బయళ్ల చుట్టూ నడిచి అందరితో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రధాని దీన్ని అవకాశంగా భావించారన్నారు. కేవలం అనధికారికంగానే సమావేశం అయినట్లు చెప్పారు. అధికారిక సమావేశం మాత్రం కాదని తేల్చిచెప్పారు.

నాలుగు ప్రతినిధి బృందాలకు పాలక కూటమి ఎంపీలు నాయకత్వం వహించారు. వీరిలో ఇద్దరు బీజేపీ, ఒకరు జేడీయూ, ఒకరు శివసేన నుంచి ఉన్నారు. ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలు, ఒక్కొక్కరు కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ(ఎస్పీ) నుంచి ఉన్నారు.

Pmmodi

బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, బైజ్యంత్ పాండా, కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్, జేడీయూకి చెందిన సంజయ్ ఝా, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, డీఎంకేకు చెందిన కనిమొళి, ఎన్‌సీపీ (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందాల్లో ప్రముఖ మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ కోరడంతో భారత్ అంగీకరించింది.

 

Met members of the various delegations who represented India in different countries and elaborated on India's commitment to peace and the need to eradicate the menace of terrorism. We are all proud of the manner in which they put forward India's voice. pic.twitter.com/MZqQYgsAEp

— Narendra Modi (@narendramodi) June 10, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • congress mp Shashi Tharoor
  • Delhi
  • Diplomatic delegations

తాజావార్తలు

  • Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు

  • Robotic Cockroach Spy: ‘స్పై’గా బొద్దింకలు..! రోబోటిక్ కాక్రోచ్ రెడీ.. ఎలా పనిచేస్తుందంటే..?

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Lok sabha: సీఈసీని తొలగించాలంటూ స్పీకర్‌కు నోటీసు.. 190 మంది ఎంపీలు సంతకాలు

  • Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి

ట్రెండింగ్‌

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions