Lok sabha: సీఈసీని తొలగించాలంటూ స్పీకర్కు నోటీసు.. 190 మంది ఎంపీలు సంతకాలు
- దేశ రాజకీయాల్లో మరో సంచలనం
- ఈసీని తొలగించాలంటూ స్పీకర్కు నోటీసు
- 190 మంది ఎంపీలు సంతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను (Chief Election Commissioner) పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. నోటీసును లోక్సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ సమర్పించారు. ఎన్నికల నిర్వహణలో తటస్థత పాటించలేదని, కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయని, వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ఆయన్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్తో నోటీసు సమర్పించినట్లు వెల్లడించారు.
ఇక ఈ నోటీసుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ వ్యవహారం ముందుకు ఎలా సాగుతుందో, పార్లమెంట్ లేదా సంబంధిత అధికార సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఎవరైనా టేబుళ్లపై ఎక్కితే ఇలాంటి చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. సభ లోపల, వెలుపల సభ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
త్వరలో తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో సీఈసీని తొలగించాలని విపక్షం నోటీసు ఇవ్వడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!