Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: మహారాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. రైలును జెండా ఊపి ప్రారంభించిన అనంతరం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ప్రధాని మోదీ చేతులు ఊపారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. ఈరోజు తెల్లవారుజామున నాగ్పూర్ చేరుకున్న ప్రధాని అక్కడ ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు.
Maharashtra | PM Narendra Modi takes a ride on Nagpur Metro from Freedom Park to Khapri, interacts with students
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
PM purchased his ticket at Freedom Park station of the Nagpur Metro. pic.twitter.com/3bL34qk3LW
— ANI (@ANI) December 11, 2022
అనంతరం నాగ్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6700 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయనున్న రైలు ప్రాజెక్టు ఫేజ్-2కి శంకుస్థాపన చేశారు. నాగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమంలో, సుమారు రూ. 590 కోట్లతో నాగ్పూర్ రైల్వే స్టేషన్, రూ. 360 కోట్లతో పునరాభివృద్ధి చేయనున్న అజ్నీ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేస్తారు. నాగ్పూర్లోని ప్రభుత్వ నిర్వహణ డిపో, అజ్ని (నాగ్పూర్), కోహ్లి-నార్ఖేర్ సెక్షన్-ఇటార్సీ థర్డ్ లైన్ ప్రాజెక్ట్లను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులను వరుసగా రూ.110 కోట్లు, దాదాపు రూ.450 కోట్లతో అభివృద్ధి చేశారు. నాగ్పూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (NIO)కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది ‘వన్ హెల్త్’ విధానంలో దేశంలో సామర్థ్యం, మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా ఒక అడుగు.
CJI: మైనర్ల సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. అది నేరమే..
నాగ్పూర్లో నాగ్ నది కాలుష్యాన్ని తగ్గించే ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ – జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక (NRCP) కింద – రూ. 1925 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో ఇది అమలు చేయబడుతుంది.
Maharashtra | PM Modi inaugurates Phase I of the Nagpur Metro rail project, lays the foundation stone of Phase- II of the rail project, which will be developed at a cost of more than Rs 6700 crore pic.twitter.com/5JqTsBWIn6
— ANI (@ANI) December 11, 2022
తాజావార్తలు
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!