Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: మహారాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. రైలును జెండా ఊపి ప్రారంభించిన అనంతరం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ప్రధాని మోదీ చేతులు ఊపారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఆరవ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. ఈరోజు తెల్లవారుజామున నాగ్పూర్ చేరుకున్న ప్రధాని అక్కడ ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు.
Maharashtra | PM Narendra Modi takes a ride on Nagpur Metro from Freedom Park to Khapri, interacts with students
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
PM purchased his ticket at Freedom Park station of the Nagpur Metro. pic.twitter.com/3bL34qk3LW
— ANI (@ANI) December 11, 2022
అనంతరం నాగ్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6700 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయనున్న రైలు ప్రాజెక్టు ఫేజ్-2కి శంకుస్థాపన చేశారు. నాగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమంలో, సుమారు రూ. 590 కోట్లతో నాగ్పూర్ రైల్వే స్టేషన్, రూ. 360 కోట్లతో పునరాభివృద్ధి చేయనున్న అజ్నీ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేస్తారు. నాగ్పూర్లోని ప్రభుత్వ నిర్వహణ డిపో, అజ్ని (నాగ్పూర్), కోహ్లి-నార్ఖేర్ సెక్షన్-ఇటార్సీ థర్డ్ లైన్ ప్రాజెక్ట్లను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులను వరుసగా రూ.110 కోట్లు, దాదాపు రూ.450 కోట్లతో అభివృద్ధి చేశారు. నాగ్పూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (NIO)కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది ‘వన్ హెల్త్’ విధానంలో దేశంలో సామర్థ్యం, మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా ఒక అడుగు.
CJI: మైనర్ల సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. అది నేరమే..
నాగ్పూర్లో నాగ్ నది కాలుష్యాన్ని తగ్గించే ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ – జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక (NRCP) కింద – రూ. 1925 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో ఇది అమలు చేయబడుతుంది.
Maharashtra | PM Modi inaugurates Phase I of the Nagpur Metro rail project, lays the foundation stone of Phase- II of the rail project, which will be developed at a cost of more than Rs 6700 crore pic.twitter.com/5JqTsBWIn6
— ANI (@ANI) December 11, 2022
తాజావార్తలు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్