CJI: మైనర్ల సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. అది నేరమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI Justice DY Chandrachud: చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యునిసెఫ్తో కలిసి జువెనైల్ జస్టిస్పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించిన పోక్సో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు. 18 ఏళ్ల లోపు వారు ఏకాభిప్రాయంతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినా పోక్సో చట్టం ప్రకారం నేరమేనని ఆయన వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం సమ్మతి వయస్సుకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించాలన్నారు. పిల్లలపై లైంగిక అకృత్యాల అంశంలో సమాజంలో పెనుసమస్యగా తయారైందని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ ఉంటున్నాయన్నారు. ఈ సంస్కృతి మారాలని.. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలని.. బాధిత చిన్నారుల వేదన వెంటనే తీర్చలేని స్థితిలో, తక్షణ న్యాయం చేకూర్చలేని స్థితిలో మన నేర శిక్షాస్మృతి ఉందనేది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. దీనికి పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నారు. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చాలా ముఖ్యమన్నారు. సురక్షితమైన స్పర్శ, అసురక్షిత స్పర్శ మధ్య తేడాను పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలని ఆయన అన్నారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Himachal Pradesh CM: పాలమ్మే స్థాయి నుంచి పాలించే స్థాయికి.. హిమాచల్ నూతన సీఎం విజయ ప్రస్థానం
బాధితుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చాలా వెనుకాడుతున్నారని, అందువల్ల పోలీసులకు అధిక అధికారాలు అప్పగించడం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సీజేఐ అన్నారు. అన్నింటికీ మించి, పిల్లల శ్రేయస్సు కంటే కుటుంబం గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వబడకుండా చూసుకోవడం తక్షణ అవసరమన్నారు. నేర న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు బాధితుల మానసిక క్షోభను పెంచే విధంగా పనిచేయడం దురదృష్టకరమని, కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ న్యాయవ్యవస్థతో చేతులు కలపాలని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?