PM Modi: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు.. కారణమిదే!
- మోడీ సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు
- మోడీ కా పరివార్ అనే నినాదం తొలగించాలని పిలుపు
- ఎక్స్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్.. కవర్ ఇమేజ్లు మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ పక్షాలకు ఆయా శాఖలు దక్కాయి. ఇక బీజేపీ కేంద్రమంత్రులకు పాత శాఖలే దక్కాయి. ఇక తాజాగా ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు చేశారు.
ఇది కూడా చదవండి: Snakebite: పాముకాటుకు బాలిక బలి.. ములుగు జిల్లాలో ఘటన
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ఎన్నికల సమయంలో బీజేపీ నేతల సోషల్ మీడియా ఖాతాల్లో మోడీ కా పరివార్ అనే నినాదం ప్రత్యేకంగా కనిపించింది. ‘‘ప్రధానికి కుటుంబం లేదు. అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు’’ అని ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్గా కమలం పార్టీ నేతలు ఆ నినాదాన్ని ప్రతిధ్వనింపజేశారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాని మోడీ కీలక సూచన చేశారు. మనమంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని ‘మోడీ కా పరివార్’ సమర్థంగా చాటిచెప్పిందని, ఇప్పుడు దీన్ని తొలగించాల్సిందిగా ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: కథువాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం..
ఎన్నికల సమయంలో తన మీద అభిమానానికి గుర్తుగా ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతా పేర్లలో ‘మోడీ కా పరివార్’ చేర్చారని గుర్తుచేశారు. ఇది తనకు చాలా శక్తినిచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి ఎన్డీయేకు విజయం కట్టబెట్టారన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలంటూ అధికారం అప్పగించారని తెలిపారు. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటిచెప్పినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక మోడీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఇమేజ్లను కూడా మార్చారు. నూతన మంత్రివర్గంతో దిగిన ఫొటోను కవర్ ఇమేజ్గా ఉంచారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం ‘ఎక్స్’ అకౌంట్లో ఇదే విధమైన మార్పులు చేపట్టింది. రాజ్యాంగానికి మోడీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోన్న ఫొటోను కవర్ ఇమేజ్గా ఉంచారు.
ఇది కూడా చదవండి: Yemen: యెమెన్లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..