PM Modi in Dubai: అబుదాబిలో ‘అహ్లాన్ మోడీ’ కార్యక్రమం.. భారీగా హాజరుకానున్న ఎన్నారైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi in Dubai: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్నారు. దుబాయ్తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఇక్కడ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. దీంతో పాటు అబుదాబిలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోడీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దుబాయ్లో నివసిస్తున్న భారతీయ సమాజం ‘అహ్లాన్ మోడీ అంటే నమస్తే మోడీ’ గొప్ప కార్యక్రమం కోసం వేచి ఉంది. ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
65 వేల మందికి పైగా హాజరు..
అహ్లాన్ మోడీ కార్యక్రమానికి హాజరు కావడానికి 65 వేల మందికి పైగా నమోదు చేసుకున్నారని తెలిసింది. అధిక సంఖ్యలో ఉన్నందున, నిర్వాహకులు గత వారంలోనే రిజిస్ట్రేషన్ను ముగించాల్సి వచ్చింది. దేశ జనాభాలో 35 శాతం ఉన్న యూఏఈలో సుమారు 35 లక్షల మంది భారతీయ ప్రవాస సంఘం నివసిస్తున్నారని తెలిసిందే. ఈ ఈవెంట్లో 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో 150 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ సమూహాలు చురుకుగా పాల్గొననున్నాయి.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
Read Also: Farmers protest: మెట్రో అధికారుల అలర్ట్.. 8 మెట్రో స్టేషన్లు క్లోజ్
ప్రధాని మోదీ షెడ్యూల్ ఎలా ఉంటుంది?
ఈ పర్యటనలో ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా, విస్తరించేందుకు, బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారు. దుబాయ్లో జరగనున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో కూడా ప్రధాన మంత్రి గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఇక్కడ ఆయన ప్రత్యేక ప్రసంగం కూడా చేస్తారు.
ఇది ఒక చారిత్రాత్మక సంఘటనగా గుర్తుండిపోతుంది..
ఇండియన్ పీపుల్ ఫోరమ్ అధ్యక్షుడు, అహ్లాన్ మోడీ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన జితేంద్ర వైద్య మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు తన సంతోషాన్ని, నిరీక్షణను వ్యక్తం చేశారు. ‘దేశం వెలుపల ప్రధాని మోడీకి సంబంధించిన ఏదైనా బహిరంగ కార్యక్రమాన్ని ప్రజలు గుర్తుచేసుకున్నప్పుడల్లా ‘అహ్లాన్ మోదీ’ ఒక చారిత్రాత్మక సంఘటనగా గుర్తుంచుకుంటారని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!