Piyush Goyal: చంద్రబాబు సీఎం అవుతారు.. ఏపీ నుంచి మా కూటమికి 25 ఎంపీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తావన వచ్చిందట.. ఇక, పెన్షన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ కి వివరించారు చంద్రబాబు నాయుడు.. మరోవైపు వచ్చే (మే నెల) నెలలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై కూడా చర్చించారట.. అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. తెలుగు నేలకు నేను రావడం గర్వంగా భావిస్తున్నాను.. గత ఐదేళ్ళుగా ఏపీ చాలా వెనుకబడింది.. రైతులను ఏపీలో పూర్తిగా పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు.
Read Also: Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
Also Read
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ఇక, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా ఏపీ మారిందని విమర్శించారు పీయూష్ గోయల్.. కేంద్రం ఇచ్చిన గృహాలు అన్నీ ప్రజలకు అందలేదు.. పోలవరం ప్రాజెక్టు 15వేల కోట్లు ఇచ్చింది కేంద్రం అని గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినా కూడా భూమిని రాష్ట్రం మాకు ఇవ్వలేదన్నారు. మరోవైపు.. భారతదేశం జీడీపీలో 5వ స్ధానానికి చేరుకున్నాం.. 2014, 2019 లలో చేసిన ఏ హామీలను ప్రధాని నరేంద్ర మోడీ మర్చిపోలేదు.. రామమందిర నిర్మాణం భారతీయులందరికీ గర్వకారణంగా చెప్పుకొచ్చారు. ఇక, 2047 నాటికి వంద సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనం పండుగలా చేసుకోవాలని కోరారు. ప్రతీ ఇంటికీ నీటి సదుపాయం ఉండేలా కేంద్రం పని చేసింది.. ప్రతీ భారతీయుడి భవితవ్యం కోసం కేంద్రం పని చేస్తోంది.. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం అత్యున్నత విధానాలు తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు సీఎం అవుతారు.. ఏపీ నుంచీ 25 ఎంపీలు మా కూటమికి వస్తారన్న ఆయన.. స్పెషల్ కేటగరీ స్టేటస్ కంటే ఎక్కువ లబ్ధి ఏపీకి జరిగిందన్నారు.. బీజేపీ ముస్లిం రిజర్వేషన్ ల విషయంలో ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ రిజర్వేషన్లు మాత్రమే రిజర్వేషన్లు మాత్రమే. రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే మాకు ఇప్పుడే అవకాశం ఉంది.. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోంది గాంధీ కుటుంబం కోసం అంటూ ఆరోపించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.
తాజావార్తలు
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!