India Pak War : శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పేలుళ్లు..? అదంతా ఫేక్.. PIB క్లారిటీ
- శ్రీనగర్ పేలుళ్ల వార్తలపై PIB క్లారిటీ
- అల్ జజీరా వార్త ఫేక్గా తేల్చిన PIB
- ఆధికారిక వర్గాల సమాచారం మాత్రమే నమ్మండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సంచలన వార్తకు ఫుల్స్టాప్ పెట్టింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిజనిర్ధారణ విభాగం. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో దాదాపు 10 పేలుళ్లు సంభవించాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB తేల్చి చెప్పింది. అల్ జజీరా ఇంగ్లీష్ ప్రచురించినట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక నివేదికలో, విమానాశ్రయం పరిసరాల్లో వరుస పేలుళ్లు జరిగాయని తప్పుగా పేర్కొన్నారు. ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Indian Official Killed: పాక్ దాడుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మృతి.. స్పందించిన సీఎం ఒమర్!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ PIB ఫాక్ట్ చెక్ ఈరోజు ఒక ట్వీట్ చేసింది. “జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ విమానాశ్రయం వద్ద దాదాపు 10 పేలుళ్లు జరిగాయని అల్ జజీరా పేర్కొంది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం” అని PIB స్పష్టం చేసింది. జాతీయ భద్రత , ప్రజల భద్రతకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని PIB ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, ధృవీకరించని వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
“తప్పుదోవ పట్టించడానికి , గందరగోళం సృష్టించడానికి ఉద్దేశించిన ఇలాంటి అవాస్తవ కథనాలను నమ్మకండి” అని PIB తన ట్వీట్లో హెచ్చరించింది. ‘ఆపరేషన్ సింధూర్’ లైవ్ న్యూస్ , భారతదేశం, వినోదం, తాజా వార్తలు, భారతదేశం పాకిస్తాన్పై దాడి వంటి ముఖ్యమైన వార్తల కోసం అధికారిక సమాచార వనరులను మాత్రమే విశ్వసించండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
India – Pakistan War: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాధారణ కార్యకలాపాలు.. ప్రయాణికులకు కీలక సూచనలు..
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!