Pesticides: తల్లి పాల ద్వారా పిల్లలకు చేరుతున్న పురుగుమందులు.. మాంసం తింటే రిస్క్ ఎక్కువట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesticides in Breast Milk: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.
అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ ఫలితాలు
ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ జనరల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో ప్రొఫెసర్ సుజాతా దేవ్, డాక్టర్ అబ్బాస్ అలీ మెహందీ, డాక్టర్ నైనా ద్వివేది పాల్గొన్నారు. అదే సమయంలో మాంసాహారం తీసుకునే మహిళలతో పోలిస్తే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో పురుగుమందులు తక్కువగానే ఉన్నాయని డాక్టర్ సుజాత తెలిపారు. కానీ శాకాహార స్త్రీల తల్లి పాలలో కూడా పురుగుమందులు కనుగొనబడ్డాయి. పాలలో పురుగుమందులను కనుగొనడం వెనుక, ఆహార పదార్థాల సాగు సమయంలో పురుగుమందుల అధిక వినియోగం అని చెప్పబడింది. పంటలకు వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలు కలుపుతున్నారని, దీనివల్ల శాఖాహారం తీసుకునే తల్లి పాలలో పురుగుమందులు దొరుకుతున్నాయని, అది కూడా తల్లి పాలు తాగి పుట్టిన బిడ్డ శరీరంలోకి వెళ్లిపోతుందన్నారు.
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
Also Read: Arab Countries: అరబ్ దేశాల్లో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళల్లో ఊబకాయం.. ఎందుకో?
మాంసాహారం తీసుకునే మహిళలకు ప్రమాదం ఎక్కువ
మాంసాహారం తినే మహిళల్లో పురుగుమందుల పెరుగుదల శాకాహార మహిళల కంటే మూడున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. ప్రస్తుతం జంతువులకు కూడా వివిధ రకాల ఇంజెక్షన్లు ఇస్తున్నారు. తల్లి ద్వారా అయినా
తల్లిపాల ద్వారా బిడ్డకు పురుగుమందు చేరుతోందో లేదో తెలుసుకోవడానికి 130 మంది మహిళలపై అధ్యయనం చేశామని ఆమె వెల్లడించారు. శిశువు పుట్టిన తర్వాత తల్లుల పాలలో పురుగుమందులు ఉన్నాయని గుర్తించామన్నారు. శిశువు జన్మించిన కొన్ని నెలల వరకు ధాన్యాలు లేదా మరే ఇతర పదార్థాన్ని తీసుకోకపోయినా, తల్లి పాలలోని పురుగుమందులు శిశువు శరీరంలోకి ప్రవేశించాయనని డాక్టర్ సుజాత చెప్పారు.
Also Read: Climate Change Analyst: క్లైమేట్ చేంజ్ అనలిస్ట్ అవ్వడం ఎలాగో తెలుసా?.. జీతం లక్షల్లో..!
రసాయనాలు, పురుగుమందులను నివారించడానికి ఈ పని చేయండి..
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఫోరెన్సిక్, టాక్సికాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షియులీ రాథోడ్ మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన విషయమని, ఈ పరిస్థితిని నివారించడానికి మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మనం ఏ కూరగాయలు, పండ్లు తిన్నా సరే ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం జరగడం లేదు. పురుగుమందుల వాడకం వల్ల ఆహార పదార్థాలన్నీ కలుషితమవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మనం కూరగాయలు, పండ్లను సరిగ్గా కడగడం లేదా పాత్రలో నీటిని నింపి కాసేపు వదిలివేయడం వలన వాటి పురుగుమందులు తొలగించబడతాయి. దానిని సరిగ్గా ఉడకబెట్టడం, ఉపయోగించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమన్నారు.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?