Pesticides: తల్లి పాల ద్వారా పిల్లలకు చేరుతున్న పురుగుమందులు.. మాంసం తింటే రిస్క్ ఎక్కువట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pesticides in Breast Milk: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.
అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ ఫలితాలు
ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ జనరల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో ప్రొఫెసర్ సుజాతా దేవ్, డాక్టర్ అబ్బాస్ అలీ మెహందీ, డాక్టర్ నైనా ద్వివేది పాల్గొన్నారు. అదే సమయంలో మాంసాహారం తీసుకునే మహిళలతో పోలిస్తే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో పురుగుమందులు తక్కువగానే ఉన్నాయని డాక్టర్ సుజాత తెలిపారు. కానీ శాకాహార స్త్రీల తల్లి పాలలో కూడా పురుగుమందులు కనుగొనబడ్డాయి. పాలలో పురుగుమందులను కనుగొనడం వెనుక, ఆహార పదార్థాల సాగు సమయంలో పురుగుమందుల అధిక వినియోగం అని చెప్పబడింది. పంటలకు వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలు కలుపుతున్నారని, దీనివల్ల శాఖాహారం తీసుకునే తల్లి పాలలో పురుగుమందులు దొరుకుతున్నాయని, అది కూడా తల్లి పాలు తాగి పుట్టిన బిడ్డ శరీరంలోకి వెళ్లిపోతుందన్నారు.
Also Read
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
Also Read: Arab Countries: అరబ్ దేశాల్లో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళల్లో ఊబకాయం.. ఎందుకో?
మాంసాహారం తీసుకునే మహిళలకు ప్రమాదం ఎక్కువ
మాంసాహారం తినే మహిళల్లో పురుగుమందుల పెరుగుదల శాకాహార మహిళల కంటే మూడున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. ప్రస్తుతం జంతువులకు కూడా వివిధ రకాల ఇంజెక్షన్లు ఇస్తున్నారు. తల్లి ద్వారా అయినా
తల్లిపాల ద్వారా బిడ్డకు పురుగుమందు చేరుతోందో లేదో తెలుసుకోవడానికి 130 మంది మహిళలపై అధ్యయనం చేశామని ఆమె వెల్లడించారు. శిశువు పుట్టిన తర్వాత తల్లుల పాలలో పురుగుమందులు ఉన్నాయని గుర్తించామన్నారు. శిశువు జన్మించిన కొన్ని నెలల వరకు ధాన్యాలు లేదా మరే ఇతర పదార్థాన్ని తీసుకోకపోయినా, తల్లి పాలలోని పురుగుమందులు శిశువు శరీరంలోకి ప్రవేశించాయనని డాక్టర్ సుజాత చెప్పారు.
Also Read: Climate Change Analyst: క్లైమేట్ చేంజ్ అనలిస్ట్ అవ్వడం ఎలాగో తెలుసా?.. జీతం లక్షల్లో..!
రసాయనాలు, పురుగుమందులను నివారించడానికి ఈ పని చేయండి..
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఫోరెన్సిక్, టాక్సికాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షియులీ రాథోడ్ మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన విషయమని, ఈ పరిస్థితిని నివారించడానికి మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మనం ఏ కూరగాయలు, పండ్లు తిన్నా సరే ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం జరగడం లేదు. పురుగుమందుల వాడకం వల్ల ఆహార పదార్థాలన్నీ కలుషితమవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మనం కూరగాయలు, పండ్లను సరిగ్గా కడగడం లేదా పాత్రలో నీటిని నింపి కాసేపు వదిలివేయడం వలన వాటి పురుగుమందులు తొలగించబడతాయి. దానిని సరిగ్గా ఉడకబెట్టడం, ఉపయోగించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!