Perni Nani: కొడుకు కోసమే చంద్రబాబు తపన.. జగన్ అడ్డంకి లేకుండా చేస్తున్నారు!
- వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు
- కొడుకు కోసమే చంద్రబాబు తపన
- వైఎస్ జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపనపడుతున్నారని పేర్కొన్నారు. మిగతా వారు అయితే మాట వింటారని.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మీద ఎలాంటి విష ప్రచారం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని పేర్ని నాని సూచించారు.
‘సిట్ ఒక అబద్ధం చెబుతుంది. దాన్ని ప్రచారం చేయాలనే ఆత్రంలో ఒక వర్గం మీడియా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా వైఎస్ జగన్ మీద విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. జగన్ను అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపన. మిగతా వాళ్లు అయితే మాట వింటారు.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారు. జగన్ మీద ఎలాంటి విష ప్రచారం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏహ్యభావం కలుగుతుంది. సిట్ ఏర్పాటు చేయగానే లక్ష కోట్ల అవినీతి అని మొదలు పెట్టారు. మద్యం వ్యాపారంలో ఏదేదో జరిగిందని అభూత కల్పనలు చేస్తున్నారు’ అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
Also Read: Amzath Basha: వైఎస్ జగన్ అంటే మీకు అంత భయం.. మాజీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!
‘బెవెరేజెస్ కార్పొరేషన్ వచ్చే సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అమ్మిన ప్రతీ బాటిల్కు సంబంధించిన నగదు బ్యాంకులో ఉదయాన్నే జమ చేయాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగకపోయినా నగదు ఒక్క రోజులోనే ఖజానాకు వస్తుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రభుత్వ షాపులు నడిపారు. అప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆన్లైన్ చేయలేదు.. నగదు లావాదేవీలు మాత్రమే చేశారు. వాసుదేవ రెడ్డి కీలకం అని మాట్లాడారు. ఇవాళ దొరికిన 11 కోట్ల నగదు 2024 జూన్లో రాజ్ కేసిరెడ్డి దాచుకున్నాడని చెబుతున్నారు’ అని వైసీపీ నేత పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!