Namburu Sankara Rao: ప్రచారంలో జోరు పెంచిన నంబూరు శంకరరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని చూసి ఒక్కసారి తనకు ఓటు వేస్తే.. ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. ఇక, క్రోసూరు మండలం బయ్యవరంలో జనసేన పార్టీకి సంబంధించిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బయ్వవరం గ్రామంలో గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానన్నారు. 2019లో బయ్వయరంలో తనకు మంచి మెజారిటీ వచ్చిందని.. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను నమ్మి గెలిపిస్తే బయ్యవరం అభివృద్ధికి అవసరమైన అన్ని పనులు చేస్తానని హామీ ఇచ్చారు. బయ్యవరం అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానన్నారు. ఎన్నికల వరకు తన కోసం నిజాయితీగా పని చేస్తే.. ఆ తర్వాత ఐదేళ్లు తాను నిజాయితీగా ప్రజల కోసం పని చేస్తానని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు.
Read Also: IPL 2024: హార్థిక్ పాండ్యాను పట్టించుకోని ఆకాశ్ మధ్వాల్
Also Read
ఇక, రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యమని.. చంద్రబాబు వస్తే అరాచక పాలన వస్తుందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట మండలం చల్లగరిగ, తాడువాయి, సండ్ర తండా, బంగారు తండా గ్రామాల్లో పర్యటించారు. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ అందడంతో.. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు.. ఆయనకు పూలతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. చల్లగరిగలో గత ఐదేళ్లలో సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అందించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా.. ఇంత పెద్ద మొత్తం పేదల ఖాతాల్లో పడ్డాయని అడిగారు. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలి.. వారి కుటుంబాలు బాగుండాలనే.. లక్ష్యంతో జగన్ పాలన కొనసాగుతుందన్నారు. పొరపాటున చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. మళ్లీ జన్మభూమి కమిటీ అరాచకాలు మొదలవుతాయన్నారు. గతంలో రుణామాఫీ, జాబులు అంటూ బూటకపు మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ కొత్త మోసాలతో వస్తున్నారు.. వారిని నమ్మితే ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారని హెచ్చరించారు. గత ఐదేళ్లలో తన పాలనలో జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక ఓటు ఎమ్మెల్యేగా తనకు, మరో ఓటు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ కి వేస్తే.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు పేదల జీవితాలు మరింత బాగుపడతాయని.. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!