Paytm : పేటీఎంకు షాకుల మీద షాకులు.. పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paytm : దేశంలోని అతిపెద్ద పిన్ టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆర్బీఐ నిషేదం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు కంపెనీ మీదకు వస్తున్నాయి. దాని ఇబ్బందులకు దారి ఇప్పట్లో దొరికేలా కనిపించడం లేదు. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రతి రోజు హెడ్లైన్స్లో కొనసాగుతోంది. ఇప్పుడు తాజా కేసులో పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుంచి కంపెనీ డైరెక్టర్ రాజీనామా చేశారు. ఇది కంపెనీ ధృవీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో దాఖలు చేసిన సమాచారం ప్రకారం.. పేటీఎం పేమెంట్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న మంజు అగర్వాల్ ఫిబ్రవరి 1న ఆయన తన రాజీనామాను బోర్డుకు సమర్పించారు. ఆర్బీఐ నిషేధం కారణంగానే మంజు అగర్వాల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Read Also:JEE Mains Results 2024: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల!
Also Read
వాస్తవానికి, జనవరి చివరి వారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త కస్టమర్లను జోడించకుండా పేటీఎం పేమెంట్ బ్యాంక్ను నిషేధించింది. ఇందుకోసం ఆర్బీఐ కంపెనీకి ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా చేశారు. కంపెనీ ధృవీకరించింది. ఇంతకుముందు, చైనాతో ఈ కంపెనీ సంబంధాలపై భారత ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్లో చైనా విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.
Read Also:BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్
గత వారం ప్రారంభంలో కంపెనీ తన ఇ-కామర్స్ వ్యాపారం పేరును కూడా మార్చింది. పేటీఎం ఇ-కామర్స్ పేరును Pai ప్లాట్ఫారమ్లుగా మార్చారు. దీనితో పాటు, ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో వాటాను పెంచుకోవడానికి కంపెనీ బిట్సీలాను కొనుగోలు చేసింది. ఆర్బఐ నిర్ణయం తర్వాత పేటీఎంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ కంపెనీలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల కూడా పేటీఎంపై ప్రజలకు నమ్మకం పోతుందని ఓ సర్వేలో ఓ విషయం బయటపడింది. ఈ సర్వే ప్రకారం, 49 శాతం చిన్న దుకాణదారులు ఇప్పుడు పేటీఎంకు బదులుగా ఇతర యాప్ల ద్వారా చెల్లింపులు చేయమని ప్రజలను కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!