BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం. ఈ సంవత్సరం బిట్కాయిన్ ధర సుమారు 16.3 శాతం పెరిగింది. అంతకుముందు డిసెంబర్ 27, 2021న బిట్కాయిన్ ధరలో 5.58 శాతం పెరుగుదల నమోదైంది. దీనితో బిట్కాయిన్ 50,196 డాలర్లకి చేరుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 11న ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభించిన తర్వాత ప్రజలు ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో కొద్ది రోజుల్లోనే బిట్ కాయిన్ 38,500 డాలర్లకు పడిపోయింది. అయితే, ఈ పతనం తర్వాత కొద్ది రోజులకే బిట్కాయిన్ మరోసారి తన వేగాన్ని పుంజుకుని 50,000డాలర్ల మార్క్ను దాటింది.
Also Read
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
Read Also:Aishwarya Rajinikanth :’కొలవెరి’ పాట వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది..
దేశంలో క్రిప్టో సెగ్మెంట్పై అధిక పన్నుల కారణంగా వృద్ధి ప్రభావితం అవుతోంది. ఈ నెల ప్రారంభంలో సమర్పించిన బడ్జెట్కు ముందు, క్రిప్టో పరిశ్రమ ఈ విభాగంలో పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే, మధ్యంతర బడ్జెట్లో క్రిప్టో సెగ్మెంట్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీంతో క్రిప్టో సంబంధిత వాటాదారులు నిరాశ చెందారు. దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతి క్రిప్టో లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించింది. దీనితో పాటు, క్రిప్టో నుండి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించబడింది. ఇది క్రిప్టో ట్రేడింగ్ కార్యకలాపాల్లో తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల్లోని నియంత్రకాలు ఈ విభాగం గురించి హెచ్చరించాయి. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రిప్టోకరెన్సీలకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రమాదం గురించి తన హెచ్చరికను పునరుద్ఘాటించింది. కొన్ని దేశాల్లో ఈ సెగ్మెంట్ ఆమోదం పొందినప్పటికీ, దీనికి సంబంధించి దాని వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఆర్బిఐ తెలిపింది.
Read Also:Damodara Raja Narsimha : ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నాం
- Tags
- Bitcoin
- Cryptocurrency
- etf
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!