BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం. ఈ సంవత్సరం బిట్కాయిన్ ధర సుమారు 16.3 శాతం పెరిగింది. అంతకుముందు డిసెంబర్ 27, 2021న బిట్కాయిన్ ధరలో 5.58 శాతం పెరుగుదల నమోదైంది. దీనితో బిట్కాయిన్ 50,196 డాలర్లకి చేరుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 11న ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభించిన తర్వాత ప్రజలు ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో కొద్ది రోజుల్లోనే బిట్ కాయిన్ 38,500 డాలర్లకు పడిపోయింది. అయితే, ఈ పతనం తర్వాత కొద్ది రోజులకే బిట్కాయిన్ మరోసారి తన వేగాన్ని పుంజుకుని 50,000డాలర్ల మార్క్ను దాటింది.
Also Read
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
- AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
Read Also:Aishwarya Rajinikanth :’కొలవెరి’ పాట వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది..
దేశంలో క్రిప్టో సెగ్మెంట్పై అధిక పన్నుల కారణంగా వృద్ధి ప్రభావితం అవుతోంది. ఈ నెల ప్రారంభంలో సమర్పించిన బడ్జెట్కు ముందు, క్రిప్టో పరిశ్రమ ఈ విభాగంలో పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే, మధ్యంతర బడ్జెట్లో క్రిప్టో సెగ్మెంట్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీంతో క్రిప్టో సంబంధిత వాటాదారులు నిరాశ చెందారు. దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతి క్రిప్టో లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించింది. దీనితో పాటు, క్రిప్టో నుండి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించబడింది. ఇది క్రిప్టో ట్రేడింగ్ కార్యకలాపాల్లో తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల్లోని నియంత్రకాలు ఈ విభాగం గురించి హెచ్చరించాయి. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రిప్టోకరెన్సీలకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రమాదం గురించి తన హెచ్చరికను పునరుద్ఘాటించింది. కొన్ని దేశాల్లో ఈ సెగ్మెంట్ ఆమోదం పొందినప్పటికీ, దీనికి సంబంధించి దాని వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఆర్బిఐ తెలిపింది.
Read Also:Damodara Raja Narsimha : ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నాం
- Tags
- Bitcoin
- Cryptocurrency
- etf
తాజావార్తలు
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!