BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం. ఈ సంవత్సరం బిట్కాయిన్ ధర సుమారు 16.3 శాతం పెరిగింది. అంతకుముందు డిసెంబర్ 27, 2021న బిట్కాయిన్ ధరలో 5.58 శాతం పెరుగుదల నమోదైంది. దీనితో బిట్కాయిన్ 50,196 డాలర్లకి చేరుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 11న ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభించిన తర్వాత ప్రజలు ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపారు. దీంతో కొద్ది రోజుల్లోనే బిట్ కాయిన్ 38,500 డాలర్లకు పడిపోయింది. అయితే, ఈ పతనం తర్వాత కొద్ది రోజులకే బిట్కాయిన్ మరోసారి తన వేగాన్ని పుంజుకుని 50,000డాలర్ల మార్క్ను దాటింది.
Also Read
Read Also:Aishwarya Rajinikanth :’కొలవెరి’ పాట వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది..
దేశంలో క్రిప్టో సెగ్మెంట్పై అధిక పన్నుల కారణంగా వృద్ధి ప్రభావితం అవుతోంది. ఈ నెల ప్రారంభంలో సమర్పించిన బడ్జెట్కు ముందు, క్రిప్టో పరిశ్రమ ఈ విభాగంలో పన్నులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే, మధ్యంతర బడ్జెట్లో క్రిప్టో సెగ్మెంట్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. దీంతో క్రిప్టో సంబంధిత వాటాదారులు నిరాశ చెందారు. దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతి క్రిప్టో లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించింది. దీనితో పాటు, క్రిప్టో నుండి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించబడింది. ఇది క్రిప్టో ట్రేడింగ్ కార్యకలాపాల్లో తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల్లోని నియంత్రకాలు ఈ విభాగం గురించి హెచ్చరించాయి. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రిప్టోకరెన్సీలకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రమాదం గురించి తన హెచ్చరికను పునరుద్ఘాటించింది. కొన్ని దేశాల్లో ఈ సెగ్మెంట్ ఆమోదం పొందినప్పటికీ, దీనికి సంబంధించి దాని వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఆర్బిఐ తెలిపింది.
Read Also:Damodara Raja Narsimha : ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నాం
- Tags
- Bitcoin
- Cryptocurrency
- etf
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!