Pawan Kalyan: పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా..
- గెలుపు కోసం మీరు పడ్డా కష్టం చూస్తే కన్నీరు వచ్చింది
- మీకు సేవ చేయడానికి శక్తి ఇమ్మని దేవుడిని ప్రార్థిస్తున్నా
- జనసేన లేని ఊరు ఉందేమోగాని..జనసైన్యం లేని ఊరు లేదు
- నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పవన్
- "పవన్ కళ్యాణ్ అనే నేను" అని జనసైనికులను ఉత్సాహ పర్చిన డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు. గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని జనసైనికులను ఉత్సాహ పర్చారు. జనసైనికులు ముందు పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి ఆఖరి శ్వాస వరకు కృషి చేస్తానని ప్రమాణం చూశారు. “పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని వస్తా. వ్యవస్థను నేను ఒక్కడినే మార్పు చేయలేను. పంచాయతీ అధికారులు సలహా కోరా. ఏఏ పనులు చేపట్టాలని.. జనాలను కోరితే 1423 ఆర్జీలు వచ్చాయి. కూటమికీ 21 ఎంపీ స్థానాలు ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. గెలుపు కోసం మీరు పడ్డా కష్టం చూస్తే కన్నీరు వచ్చింది. మీకు సేవ చేయడానికి శక్తి ఇమ్మని దేవుడిని ప్రార్థిస్తున్నా. జనసేన లేని ఊరు ఉందేమోగాని..జనసైన్యం లేని ఊరు లేదు. సంతోషం వస్తే పొగుడుతారు. కోపం వస్తే నన్నే తిడతారు. దేవుడని కాళ్ళు పట్టుకుని లాగేయకండీ.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: RACHARIKAM Movie: ఆర్జీవీ పోరి ఇలా అయ్యిందేంటి..? భయపెడుతున్న అప్సరా రాణి..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
స్లోగన్లు ఇచ్చే పని అయిపోయింది అభివృద్ధి సాధించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..”నేడు రాష్ట్రం అంతా తిరిగే శక్తిని మీరే ఇచ్చారు. నా కుటుంబం నన్ను గెలిపిస్తుందనే విశ్వాసం ఉంది. నాకు భయం లేదు గట్టి వాడిని మొండి వాడిని..బాధ్యతగా ఉంటాను…. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణం ఇస్తా. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేయకపోతే ఆంధ్రా రాష్ట్రం ఉండేది కాదు. గతంలో ఏవరు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని ఉండే వారు కాదు. పిఠాపురంలో గెలవకపోతే ఏమి చేయలేక పోయేవాడిని. ఘన విజయం అందించిన పిఠాపురం ప్రజలకు నా కృతజ్ఞతలు. నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తా.” అని పవన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!