Pawan Kalyan: నేటి నుంచి పవన్ వారాహి యాత్ర.. ఈ సారి టార్గెట్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి స్టార్ట్ కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు ఈ వారాహి యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. విశాఖలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి జనసేనాని మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రలో భాగంగా జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసే సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు.
Read Also: Mustard Benefits : ఆవాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదలరు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇక వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పవన్ వారాహి యాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసులు ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని జనసేనానికి సూచించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని పోలీసులు షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేసినా.. కార్యకర్తలు, అభిమానులు బిల్డింగ్ లు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిపైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Twin Banana: జంట అరటిపండ్లను తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!
అయితే, పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్లో రియాక్ట్ అయింది. ర్యాలీలో లేదా సభా వేదిక దగ్గర క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, పోలీసులకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. వారాహి యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుందని జనసేన పార్టీ తమ ప్రకటనలో వెల్లడించింది. పవన్ కళ్యాణ్ భద్రతకు భగం వాటిల్లకుండా వారాహి యాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!