Pawan Kalyan: కాకినాడపై స్పెషల్ ఫోకస్.. పవన్ కల్యాణ్ పర్యటన పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కాకినాడ పర్యటన పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాకినాడ సిటీ నియోజక వర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని.. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల సమీక్ష చేపట్టిన ఆయన కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.. అంతేకాదు.. 50 డివిజన్ల నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో సైతం నేతల పనితీరుపై ఆయన ఆరా తీశారు.. కొన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. ఇక, ఈ రోజు కాకినాడ సిటీపైనే సమీక్ష చేశారు..
Read Also: Naga Shaurya: పెళ్ళై ఏడాది కాకముందే నాగశౌర్య వేరు కాపురం.. షాకింగ్ విషయాలు చెప్పిన తల్లి
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అయితే, కాకినాడలో పవన్ కల్యాణ్ పర్యటన మరొక రోజు పొడిగించారు.. కాకినాడ సిటీ నియోజకవర్గం పై ప్రత్యేక పోకస్ పెట్టిన జనసేనాని.. మొత్తం 50 డివిజన్లు, వార్డులు వారీగా రివ్యూ చేస్తున్నారు.. ఇప్పటి వరకు 15 డివిజన్లకు సంబంధించిన జనసైనికులతో సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు.. మిగతా డివిజన్లపై కూడా పూర్తిస్థాయిలో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.. దీనికి ప్రత్యేక కారణం ఉంది.. వారాహి యాత్రలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డినిని ఓడించి తీరుతానని సవాల్ చేశారు పవన్ కల్యాణ్.. అయితే, దీనిపై స్పందించిన ద్వారంపూడి.. దమ్ముంటే పవన్ కల్యాణ్ తనపై పోటీ చేయాలని ప్రతి సవాలు విసిరారు.. దీంతో పవన్ కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. కాకినాడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని, దాని ప్రభావం జిల్లాపై ఉంటుందని స్థానిక నేతలు కోరుతున్నారు.. ఇక, షెడ్యూల్ ప్రకారం రేపటితో పవన్ కల్యాణ్ కాకినాడ టూర్ ముగియనుంది. అంటే.. 28, 29, 30 తేదీల్లో కాకినాడలో పర్యటించాలని పవన్ నిర్ణయించారు.. ఇప్పుడు మరొకరోజు పొడిగించడంతో.. 31వ తేదీన కూడా కాకినాడలో పవన్ సమీక్షలు కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
Read Also: Perni Nani: వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు..
కాగా, నేను కాకినాడలో పుట్టి ఈ స్థాయికి రావడానికి రాజకీయాల్లో కష్టపడ్డాను.. కాకినాడ నుంచి రెండుసార్లు గెలిచాను.. కానీ, పవన్ రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు.. ఇవే మా ట్రాక్ రికార్డ్స్ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. ఇక, పీడీఎస్ బియ్యం ఎగుమతి ద్వారా నేను, మా కుటుంబం రూ.15 వేల కోట్లు సంపాదించామని పవన్ కల్యాణ్ ఆరోపించారు. బియ్యం ఎగుమతులపై పవన్కు ఏమీ తెలియదని రుజువు చేసింది. నా దగ్గర అంత కోట్లు ఉంటే నేను ఈజీగా పవన్ కల్యాణ్ను కొనుగోలు చేసి ఆఫర్ ఇచ్చేవాడిని అని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!