Pawan Kalyan: మీకు కత్తి ఇస్తాను.. తప్ప చేస్తే నా తల నరకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: మీకు కత్తి ఇస్తాను తప్ప చేస్తే నా తల నరకండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో పోలవరం ప్రాజక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ విజయభేరి ప్రజాగళంలో భాగంగా వారాహి యాత్ర తూర్పుగోదారి జిల్లా కోరుకొండలో నిర్వహంచారు. దీనిలో నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను కులాలకు అతీతమైన వ్యక్తి అని పదే పదే చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో కాపు కార్పొరేషన్లకు రెండు వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదని, కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు కాబట్టి ఆర్ధికంగా వెనబడిన వారికి ఇచ్చే ఈబీసీ ఇస్తామని చెప్పిన వైసీపీ.. ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈబీసీ రిజర్వేషన్ తీసేశారన్నారు. ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు తీసేసారు చెప్పాలన్నారు.
Read Also: SunRisers Hyderabad: టీ-20 చరిత్రలో తొలిసారి.. అరుదైన రికార్డులు సాధించిన సన్రైజర్స్..
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
ఇక, నన్ను తిట్టడానికి మాత్రమే కాపు ఎమ్మెల్యేలు, నాయకులను సీఎం వైఎస్ జగన్ ఉపయోగించుకున్నారు అని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్.. రాజానగరం నియోజకవర్గం గంజాయి, ఇసుక, దోపిడి, బ్లేడ్ బ్యాచ్ కు రాజధానిగా ఉందని ఆరోపించారు. ఎన్టీయ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అడ్డుకట్ట వేసి వైసీపీ గూండాల తాట తీస్తామని హెచ్చరించారు. ఎన్డీఏ కూటిమి అధికారంలోకి వస్తే చర్చిలు మూతపడతాయని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు అన్ని కులాలు సమానం అని చెప్పడానికి క్రిస్టియన్ సినిమా జానీ తీయడం జరిగింన్నారు. అన్ని కులాలు, మతాలను ప్రేమిస్తాన్నారు. కోరుకొండ మండలంలో 600 వందల ఎకరాలు ,రూ. 15 లక్షలకు రైతుల దగ్గర తీసుకుని రూ. 45 లక్షలు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేసారని.. దీనిలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలోను సుమారు రూ.300 కోట్లు వైసీపీ నాయకులు సంపాదించాదరన్నారు. ఈ నియోజకవర్గంలో నేషనల్ ట్రిబ్యునల్ మూడున్నర కోట్లు ఫెనాల్టీ విధించినా.. దోపిడి ఆగలేదన్నారు. పోలీస్ శాఖలో కొందరు ఉద్యోగులు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను ఇబ్బంది పెడితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోరుకొండ పరిధిలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!