తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ మహిళ వేసిన ప్లాన్ చివరకు ఆమెనే ఉచ్చులో పడేసింది. బంగారం దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లుతూ పోలీసులను మోసం చేయాలని ప్రయత్నించిన ‘కిలాడి లేడీ’.. చివరకు విచారణలో దొరికిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజమండ్రి నార్త్ డీఎస్పీ సుభాష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కోరుకొండలో ఒంటరిగా నివాసం ఉంటున్న ముండ్రు పద్మ (56) తాను కొనుగోలు చేసిన…
మనం కొన్ని అంకెల్ని అంతగా ఇష్టపడం. అందులో ముఖ్యమయింది ఏడు. అందుకే గ్రామాల్లో ఆ పదం కూడా వాడరు. ధాన్యం బస్తాలైనా, ఏ వస్తువలైనా లెక్కించేటప్పుడు ఆ పదం పలకరు. ఆరునొకటి అంటారు. అదే సెంటిమెంట్ తూర్పుగోదావరి జిల్లాలోనూ వుంది. కోరుకొండ (మం) బుచ్చెంపేట పంచాయతీ ఏడో వార్డు ఎన్నికకు వింత పరిస్థితి నెలకొంది. వరుసగా మూడోసారి వార్డులో పోటీకి ఎలాంటి నామినేషన్లు రాలేదు. ఏడో వార్డ్ కి మెంబర్ అయితే ప్రాణగండం ఉందంటూ సెంటిమెంట్ వుండడంతో…