Pawan Kalyan: రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరువైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా?.. చిత్తూరు జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కిరాతకంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రి జగన్ గానీ, హోంశాఖ మంత్రి తానేటి వనిత గానీ, మహిళా కమిషన్ ఛైర్మన్ గానీ ఎందుకు స్పందించటం లేదు? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Read Also: Most Visited Island: ప్రపంచంలో ఎక్కువ మంది వెళ్లే ద్వీపం.. ఎందుకు అక్కడకు వెళ్తారో తెలుసా?
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. విజయనగరం జిల్లాలో తుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలిచి వేసింది.. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరువైంది అనే మాట వాస్తవం.. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసులు చేతులను పాలక పక్షం కట్టేస్తోంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో దిశ చట్టాలు చేశాం.. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం అనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!